తెలకపల్లి వ్యూస్ : జగన్‌ఆస్తుల అమ్మకం సాధ్యమా?

అక్రమలావాదేవీలకు సంబంధించిన ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రజావసరాలకు వినియోగించేందుకు వీలు కల్పించే ఎపి చట్టానికి రాష్ట్రపతి ఆమోదం లభించింది.ఇక దీన్ని ప్రతిపక్ష వైసీపీ నేత జగన్‌ అటాచ్డ్‌ ఆస్తులపై ప్రయోగిస్తారని కథలు వస్తున్నాయి. కొంత మంది ఆ మేరకు డిమాండ్‌ చేస్తున్నారు కూడా. కాని వాస్తవం ఏమంటే ఈ చట్టం అంత వెనువెంటనే ఆయన ఆస్తులను అమ్మేయడానికి అవకాశమిచ్చేదిగా వుండదు. రకరకాల అవినీతి వ్యవహారాలు అక్రమాలలో స్వాధీనం చేసుకున్న ఆస్తులను ఏళ్లతరబడి అంటుకోకుండా కొనసాగించడం వల్ల విశ్వసనీయత దెబ్బతింటుందనేది ఇక్కడ ప్రభుత్వ వాదన. అయితే అక్రమాస్తులుగా న్యాయస్థానాలు నిర్ధారించి తీర్పు చెప్పకుండా ప్రభుత్వం ఆ ఆస్తులను స్వాధీన పర్చుకోవడం కుదరదు. ఈ విషయంలో సిబిఐ న్యాయస్థానాల్లో ఆలస్యం జరగుతుందని గనక ప్రత్యేక న్యాయస్థానాలు లేదా ధర్మాసనాలు ఏర్పాటు చేసి త్వరితంగా తేల్చాస్తామని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. అయితే అలాటి ఏర్పాట్లకే చాలా సమయం అయిపోతుంది.తర్వాత విచారణజరగాలి.ఆస్తుల వారిగా లెక్క తేలాలి. ఒక వేళ ఇప్పటికే ఉన్న త న్యాయస్థానాల్లో వుంటే వాటి అభిప్రాయం తీసుకోవాలి. ఇవేమీ లేకుండా జగన్‌ ఆస్తుల అమ్మకం జరిగిపోతుందనుకోవడం పొరబాటే. కోర్టులపై గౌరవం వుంది గనకే వారం వారం హాజరవుతున్నానని చెప్పిన ఆయనకు తర్వాత హాజరునుంచి మినహాయింపు లభించింది. ఇతరులు కూడా ఒకరిద్దరు ఈ వారం వారం భారం తప్పించుకోగలిగారు. అయితే సాక్షి సంస్థ ప్రభుత్వ ఆధీనంలో వుంది గనక దాన్నిస్వాధీనం చేసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించి వున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌'(ఈడీ) స్వాధీనం అంటే అది తాత్కాలికమే.సాధారణ కోర్టులు లేదా ప్రభుత్వ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు తేల్చవలసి వుంటుంది.నిజానికి ఈ ప్రభుత్వం వచ్చిఇన్నాళ్లయినా అంతకు ముందే తామే అనేక ఆరోపణలు చేసిన జగన్‌కు సంబంధించిన కీలక కుంభకోణాలేవీ బయిటపెట్టింది లేదు.దర్యాప్తు వేగవంతం చేస్తే మంచిదే

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close