చెన్నై ఐటీకి వరదల దెబ్బ

ఇన్ఫోసిస్, టీసీఎస్, కాగ్నిజెంట్… పేరు ఏదైనా సీన్ ఒకటే. చెన్నై వరదలతో అపారనష్టం. ఆఫీసుల్లోకి నీరు చేరడం, విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, ఉద్యోగులు ఆఫీసులకు చేరే పరిస్థితి లేకపోవడం వంటి కారణాలతో వందల కోట్ల నష్టం తప్పలేదు. దీంతో మధ్య స్థాయి ఐటీ కంపెనీలకు దాదాపు 10 మిలియన్ డాలర్లు, అంటే 65 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది. బడా ఐటీ కంపెనీలకు దాదాపు 50 మిలియన్ డాలర్లు, అంటే సుమారు 325 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది.

ఆర్థికంగా నష్టాలే కాదు, ప్రాజెక్టులను కాపాడుకోవడం, ముఖ్యమైన క్లయింట్లకు ఇబ్బంది రాకుండా చూడటం ఈ కంపెనీలకు కత్తిమీద సాముగా మారింది. అందుకే, బడా కంపెనీలు తమ ఉద్యోగులను ప్రత్యేక బస్సుల్లో బెంగళూరుకు తరలించాయి. దాదాపు ప్రతి కంపెనీ దాదాపు 2 వేల మంది ఉద్యోగులను ఇప్పటికే బెంగళూరుకు తరలించి, అక్కడి ఆఫీసుల నుంచి పనిచేయిస్తున్నాయి. ఇప్పటికీ ప్రతి రోజూ ఈ కంపెనీల బస్సులు ఉద్యోగులను బెంగళూరుకు తరలిస్తూనే ఉన్నాయి.

ఆటో మొబైల్ పరిశ్రమకూ వరదల వల్ల నష్టాలు తప్పలేదు. ఆటోమొబైల్, ఇంజినీరింగ్ కంపెనీలకు దాదాపు 15 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టు అంచనా. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కూడా భారీగా నష్టపోయాయని అసోచాం తెలిపింది. అశోక్ లేలాండ్, హ్యుండాయ్, రెనాల్ట్, నిసాన్ తదితర ఆటో మొబైల్ కంపెనీలు మూతపడ్డాయి. ఉత్పత్తి నిలిచిపోయింది. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని, కాబట్టి నష్టాలు పెరగవచ్చని ఈ కంపెనీల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి.

భారీ వర్షాలు, వరదల కారణంగా తమిళనాడులో 450 మందికి పైగా మరణించారు. ఇప్పటికీ అనేక కాలనీలు నీటిలోనే ఉన్నాయి. పాలు, కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటాయి. మంచి నీటి కోసం, తిండి కోసం జనం అల్లాడుతున్నారు. ప్రజల కష్టాలు అలా ఉంటే, కంపెనీల నష్టాలూ అపారమే అని అంచనాలు వేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close