ఐవైఆర్‌కి సదుద్దేశం లేదన్న హైకోర్టు..!

ఐవైఆర్‌కు హైకోర్టు షాక్ ఇచ్చింది. ప్రజాప్రయోజనం కోసం అంటూ.. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది. ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ విషయంలో.. ఐవైఆర్ కృష్ణారావు పడిన హైరానా.. .హైకోర్టులో పిటిషన్ వరకూ వెళ్లింది. ప్రస్తుతం ఫౌండేషన్ ఫర్ సోషల్ అవేర్‌నెస్ అనే స్వచ్చంద సంస్థను నడుపుతున్నారు. ఈ సంస్థకు అధ్యక్షుని హోదాలో… హైకోర్టులో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీని ప్రకారం.. ” ప్రభుత్వ అధికారులకు కనీస పదవి కాల భద్రత” కల్పించాలని ఆయన కోరారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు పిటిషన్‌ వేయడంలో.. సదుద్దేశం కనిపించడం లేదని స్పష్టం చేస్తూ కొట్టి వేసింది. అఖిలభారత సర్వీసు అధికారుల విషయంలో ఇప్పటికే.. సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిందన్నారు. ఒక వేళ అమలు కాలేదని భావిస్తే.. సుప్రీంకోర్టులో కేసు వేయవచ్చని సూచించింది.

బదిలీపై అసంతృప్తి ఉంటే.. ఎల్వీ సుబ్రహ్మణ్యం కోర్టును ఆశ్రయించవచ్చని.. హైకోర్టు వ్యాఖ్యానించింది. హైకోర్టు పిటిషన్ కొట్టి వేయడంతో.. సుప్రీంకోర్టుకు వెళ్తానని ఐవైఆర్ చెప్పుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎల్వీ సుబ్రహ్మణ్యం తొలగింపుపై.. ఎల్వీ కన్నా . .ఐవైఆర్ ఎక్కువగా.. ఆవేశపడుతున్నారు. ఎల్వీని తొలగించినప్పుడే.. సోషల్ మీడియాలో.. సీఎంవో అధికారుల బాధ్యత లేని అధికారం అంటూ.. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన ఆయన తర్వాత.. పత్రికల్లో ఆర్టికల్స్ రాశారు. ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. అధికారుల బదిలీలు ఆయన చేతుల మీదుగానే జరిగాయి. ఆయన అధికారంలో ఉన్నప్పుడు.. ఇలా ఎవరికైనా.. కరెండేళ్లు పదవీకాల భద్రత ఇవ్వాలన్న సిఫార్సును ప్రభుత్వానికి చేయలేదు.

ఐవైఆర్ కృష్ణారావు నిజానికి.. ఏపీ ప్రభుత్వ పెద్దలకు..నిన్నామొన్నటి వరకూ సన్నిహితుడే. చంద్రబాబుతో చెడిన తర్వాత ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ.. వైసీపీ హైకమాండ్ కు దగ్గరయ్యారు. సాక్షి మీడియాలో కావాల్సినంత స్పేస్ పొందారు. వైసీపీలో చేరుతారని అనుకున్నారు కానీ.. ఆయన బీజేపీని ఎంచుకున్నారు. ఇప్పుడు.. వైసీపీ సర్కార్ ను.. కోర్టుకు లాగేందుకు ప్రయత్నిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు శిక్ష ప‌డ్డ‌ ఈ శిరోముండ‌నం కేసు ఏంటీ?

వైసీపీ ఎమ్మెల్సీ, ప్ర‌స్తుత మండ‌పేట తోట త్రిమూర్తులుకు శిక్ష ప‌డ్డ శిరోముండ‌నం కేసు ఏపీలో సంచ‌ల‌నంగా మారింది. 28 సంవ‌త్స‌రాల త‌ర్వాత తీర్పు వెలువ‌డ‌గా... అసలు ఆరోజు ఏం జ‌రిగింది? ఎందుకు ఇంత...

విష్ణు ప్ర‌మోష‌న్ స్ట్రాట‌జీ: భ‌క్త‌క‌న్న‌ప్పపై పుస్త‌కం

రాజ‌మౌళి మెగాఫోన్ ప‌ట్టాక‌, మేకింగ్ స్టైలే కాదు, ప్ర‌మోష‌న్ స్ట్రాట‌జీలు కూడా పూర్తిగా మారిపోయాయి. `బాహుబ‌లి`, `ఆర్‌.ఆర్‌.ఆర్‌` కోసం జ‌క్క‌న్న వేసిన ప‌బ్లిసిటీ ఎత్తులకు బాలీవుడ్ మేధావులు కూడా చిత్త‌యిపోయారు. ఓ హాలీవుడ్...

జ‌గ‌న్ కు షాక్… వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థికి 18నెల‌ల జైలు

వైసీపీ అధినేత జ‌గ‌న్ కు మ‌రోషాక్ త‌గిలింది. వైసీపీ ఎమ్మెల్యేగా మండ‌పేట అసెంబ్లీ నుండి పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు కోర్టు 18నెల‌ల జైలు శిక్ష విధించింది. 28 సంవ‌త్స‌రాల క్రితం...

కాంగ్రెస్ మేనిఫెస్టో వర్సెస్ బీజేపీ మేనిఫెస్టో ..!!

లోక్ సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించాలని బీజేపీ...ఈసారి ఎలాగైనా అధికారం చేపట్టాలని కాంగ్రెస్ మేనిఫెస్టోకు రూపకల్పన చేసి విడుదల చేశాయి. కాంగ్రెస్ న్యాయ్ పత్ర్ పేరుతో బీజేపీ సంకల్ప్ పత్ర్ పేరుతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close