రఘువీరా నిరసనలని ఎవరూ పట్టించుకోలేదు కానీ జగన్ చేస్తే అందరూ ఎలర్ట్

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తెలంగాణాలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని నిరసిస్తూ మే 16 నుంచి మూడు రోజులు కర్నూలులో నిరాహార దీక్ష చేయబోతున్నట్లు ప్రకటించారు. దానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి విశేష స్పందన వస్తోంది. అయితే అది ఆయనకు అనుకూలంగా కాక వ్యతిరేకంగా ఉంటోంది. అందరి కంటే ముందుగా ఏపి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పందిస్తూ, “రాష్ట్రానికి నష్టం కలిగించే తెలంగాణా ప్రాజెక్టుల గురించి మేము పట్టించుకోలేదన్న జగన్ ఆరోపణలు అవాస్తవం. మేము ఈ సమస్యల గురించి కృష్ణా, గోదావరి జలవనరుల బోర్డులలో గట్టిగా మాట్లాడుతూనే ఉన్నాము. జగన్ తన పార్టీని కాపాడుకొనేందుకు తెలిసీ తెలియకుండా ఏవేవో మాట్లాడుతూ ప్రజలను మభ్య పెట్టాలని ప్రయత్నిస్తున్నారు,” అని అన్నారు.

తెలంగాణా నీటిపారుదల శాఖ మంత్రి టి. హరీష్ రావు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరూ కూడా జగన్ ఆరోపణలని తప్పు పట్టారు. ఆంధ్రాలో తెదేపా, వైకాపాల మద్య జరుగుతున్న రాజకీయాల కోసమే తెలంగాణా ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నారని వారు అభిప్రాయం వ్యక్తం చేసారు.

రాజ్యసభ సభ్యుడు వి.హనుమంత రావు కూడా జగన్ తెలిసీ తెలియకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఒకప్పుడు డా. రాజశేఖర్ రెడ్డి ఎలాంటి అనుమతులు లేకుండా పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నుంచి నీళ్ళు తరలించలేదా? అని ప్రశ్నించారు. తెలంగాణాలో నిర్మించే ప్రాజెక్టుల వలన దిగువనున్న ఆంధ్రాకి నష్టం కలుగుతుందని వాదిస్తూ జగన్ నిరాహార దీక్ష చేయడం సరికాదని ఆయన అన్నారు.

ఈ ప్రాజెక్టులపై ఏపి కాంగ్రెస్ భిన్నంగా స్పందించింది. ఆ పార్టీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి రాష్ట్రంలో అందరికంటే ముందుగా తెలంగాణాలో నిర్మితమవుతున్న ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ మాట్లాడారు కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఎవరూ పట్టించుకోకపోవడంతో, ఆయన నిరసనలు ఎవరి దృష్టిని ఆకర్షించలేకపోయాయి. దానిని జగన్ అందిపుచ్చుకోగానే చాలా హైలైట్ అవుతోంది. అంటే ఈ వ్యవహారంలో అసలు సమస్య కంటే దానిని లేవనెత్తిన వ్యక్తిని బట్టే దానికి ప్రాధాన్యత ఏర్పడినట్లు స్పష్టమవుతోంది. తెలంగాణ ప్రాజెక్టులపై రఘువీరా రెడ్డి నిరసనలు తెలిపినపుడు పట్టించుకోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదే సమస్యపై జగన్ దీక్షకు కూర్చోబోతున్నట్లు ప్రకటించగానే, వాటి గురించి కేంద్రంతో మాట్లాడుతానని చెప్పడమే అందుకు చక్కటి ఉదాహరణ.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close