పిచ్చి కుదిరింది .. రోకలి తలకు చుట్టమన్నట్లుగా .. వైసీపీ అధినేత జగన్ రాజకీయం చేస్తున్నారు. సీఎంగా ఉన్న ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని అరాచకశక్తులకు వదిలేసి.. మొత్తంగా ఆయన పాతాళంలోకి పడిపోయారు. ఇప్పటికీ బుద్ది రాలేదు. ఇప్పటికీ ఆయన అరాచకశక్తులనే నమ్ముకోవాలని నిర్ణయించుకున్నారు. తెనాలిలో ఒక్కొక్కరిపై పదికిపైగా కేసులు ఉన్న ముగ్గురు రౌడిషీటర్లను పరామర్శించడానికి వెళ్తున్నారు. ఆయన తీరు సామాన్యులను సైతం విస్మయానికి గురి చేస్తోంది
ఎంతో ఆలోచించి తీసుకున్న నిర్ణయం!
జగన్ తెలివి తక్కువ వాడేం కాదు. జగన్ రెడ్డి ఎంతో ఆలోచించి ఆ చోటా రౌడీల్ని పరామర్శించి.. అండగా ఉన్నానని భరోసా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. తన పరామర్శ ద్వారా జగన్ కేవలం ఆ ముగ్గురికి కాదు.. రాష్ట్రంలో ఉన్న అలాంటి చోటా రౌడీలందరికీ , గంజాయి, బ్లేడ్ బ్యాచ్ సభ్యులందరికీ సందేశం ఇవ్వనున్నారు. మీరంతా రెచ్చిపోండి.. మీ కోసం జగనన్న ఉన్నాడు. ఎన్ని దోపిడీలు, ఎన్ని అరాచకాలు అయినా చేయండి.. కేసులు పాలైనా భయపడకుండా నేను చూసుకుంటానని భరోసా ఇవ్వబోతున్నాడు. ఆయన అనాలోచితంగా ఈ పరామర్శ పెట్టుకోలేదు
శాంతిభద్రతల్ని , ప్రజల మానప్రాణాల్ని పణంగా పెడుతున్న జగన్
రౌడీలకు భయం ముఖ్యం. ఏ చిన్న తప్పు చేసినా పోలీసులు దండిస్తారన్న భయంతోనే వారు ఎక్కువగా కంట్రోల్ లో ఉంటారు. తమకు మద్దతు ఉందని తెలిస్తే వారు ఎంత రెచ్చిపోతారో చెప్పాల్సిన పని లేదు. ఆ బాధలు పడే వారికి తెలుస్తుంది. తెనాలిలో ఆ ముగ్గురి గురించి కథలు కథలుగా చెబుతారు. జగన్ రెడ్డి ఇలాంటి వాళ్లను పరామర్శిస్తే.. ఆ స్ఫూర్తితో మరికొంత మంది తయారవుతారు. వారంతా ప్రజల్ని వేధిస్తారు. జగన్ రెడ్డికి కూడా కావాల్సింది ఇదే. శాంతిభద్రతల సమస్యలు వస్తే మళ్లీ జగన్ రెడ్డినే ప్రభుత్వాన్ని విమర్శిస్తారు. ఇలాంటి రౌడీలను ఆయనే పెంచి పోషిస్తారు.
రౌడీలకు జగన్ ఇస్తున్న సందేశం
సాధారణంగా శవం ఉంటే తప్ప జగన్ కదలరు. కానీ అలాంటిదేం లేకపోయినా తెనాలి వెళ్తున్నారు. అక్కడ శవం లేదు…కానీ పోలీసులు కొట్టారంటూ దళిత కార్డు పట్టుకుని ముగ్గుర్ని పరామర్శించనున్నారు. ఆయన ఎవర్ని పరామర్శించబోతున్నారో వారి ట్రాక్ రికార్డు ఇప్పుడు రాష్ట్రం మొత్తానికి తెలిసింది. అయినా జగన్ వెళ్తున్నారంటే….ఏపీలో ఉండే అసాంఘిక శక్తులన్నింటికీ తాను ఉన్నానని భరోసా ఇవ్వడమే.
రాక్షసుల నుంచి ప్రజల్ని కాపాడాలి !
లోపల క్యారెక్టర్ ఎలాంటిదయినా.. ఎలా ఉన్నా రాజకీయాల్లో ప్రజల ముందు కాస్త క్లీన్ గా ఉండేలా చూసుకోవాలి. రాజకీయనాయకులు జేబుదొంగల స్థాయి నుంచి పైకి ఎదుగుతారు. వైసీపీలో ఓ విజయవాడ కార్పొరేటర్ కుటుంబం అంతా ప్రొఫెషనల్ జేబుదొంగలు. వైసీపీ హయాంలోనే పోలీసులకు దొరికారు. జగన్మోహన్ రెడ్డి గురించి కథలు కథలుగా చెబుతారు. ఇలాంటి వారిని రాజకీయాల్లో కంట్రోల్ చేయాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. చోటా రౌడీలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి.. కంట్రోల్ చేయకపోతే వీరంతా జగన్ రెడ్డి గ్యాంగ్గా మారి రాష్ట్ర ప్రజల్ని పీడించుకు తింటారు. ప్రభుత్వంతో పాటు ప్రజలు అప్రమత్తమవ్వాల్సిన సమయం.