బాకా ఊదుతున్న రిటైర్డ్ జర్నలిస్టులకు రూ.10 లక్షల నజరానా !

సీఎం జగన్ జిల్లాల పర్యటనలకు పరదాలు కడుతున్న వారు బిల్లులివ్వడం లేదు మహా ప్రభో అని గగ్గోలు పెడుతున్నారు. హైకోర్టులో ప్రభుత్వం నుంచి చేసిన పనులకు బిల్లులు రావడం లేదని.. రోజుకు ఆరేడు వందల పిటిషన్లు పడుతున్నాయి. అవన్నీ పక్కన పెట్టి.. ఒక్కొక్కరికి రూ. పది లక్షలు ఇస్తామంటూ వైఎస్ఆర్ అవార్డుల్ని ప్రకటించారు. మిగిలిన వాళ్లను పక్కన పెడితే..నలుగురు జర్నలిస్టుల పేర్లు మాత్రం అందర్నీ ఆకట్టుకున్నాయి. ఆ నలుగురు ఎవరంటే బండారు శ్రీనివాసరావు, సతీష్ చందర్, మంగు రాజగోపాల్, ఎంఈవీ ప్రసాదరెడ్డి.

వీరి గురించి జర్నలిజం సర్కిళ్లలో అందరికీ తెలుసు. ప్రభుత్వానికి బాకా ఊదడానికి ఏ మాత్రం సిగ్గుపడకుండా.. అడ్డగోలుగా సమర్థిస్తూ మాట్లాడటంలో రాటుదేలిపోయారు. బండారు శ్రీనివాసరావు అనే జర్నలిస్టు రిటైరైన తర్వాత ఎర్నలిస్టుగా మారారు. అడ్డగోలుగా వాదిస్తూ టీవీ చానళ్లలో చర్చల్లో పాల్గొంటున్నారు. ఆయనకు ఎంతో కొంత ముట్టచెప్పాలనుకున్నారు కాబట్టి వైఎస్ఆర్‌ అవార్డు కింద నగదు ప్రకటించినట్లుగా ఉంది. మిగిలిన వారూ అంతే. ఇక ఎంఈవీ ప్రసాదరెడ్డి అనే జర్నలిస్టు గురించి .. పెద్దగా ఎవరికీ తెలియదు. కళ్లను నమ్ము కమ్మని నమ్మవద్దంటూ.. ఇటీవస ఈ రెడ్డిగారు ఓ యూట్యూబ్ చానల్‌కు ఇంటర్యూ ఇచ్చారు.

ఇది బాగా నచ్చిందేమో కానీ ఓ రూ. పది లక్షల అవార్డు ఇచ్చేశారు. వీరి ఎంపిక ఇతర సీనియర్ జర్నలిస్టులకుపోటీ పెట్టినట్లయింది. ఎవరు గొప్పగా పొగుడుతారో.. వాళ్లకి వచ్చే సారి అవార్డిస్తారు. రూ. పది లక్షలు గెల్చుకోవచ్చు. అయితే ఈ అవార్డులు ఎప్పుడిస్తారు.. జయంతి.. వర్థంతులు.. సెప్టెంబర్‌తోనే అయిపోయాయి. మళ్లీ వచ్చే ఏడాది వరకూ ఆగాలా.. మరో కార్యక్రమం పెట్టి ఇస్తారా అన్నది వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘పుష్ష 2’ సెట్లో గొడ‌వ జ‌రిగిందా?

జానీ మాస్ట‌ర్ వ్య‌వ‌హారం రోజుకో మ‌లుపు తిరుగుతోంది. రోజుకో నిజం బ‌య‌ట‌కు వ‌స్తోంది. జానీ మాస్ట‌ర్‌కూ బాధితురాలికీ మ‌ధ్య స‌యోధ్య కుద‌ర్చాల‌ని ఓ పెద్ద హీరో ప్ర‌య‌త్నించిన‌ట్టు వార్త‌లొచ్చాయి. ఇప్పుడు ద‌ర్శ‌కుడు సుకుమార్...

ఆ ప్రజాగ్రహ ఓటులోనే బూడిదయ్యారు జగన్ గారూ !

జగన్ రెడ్డి ఓడిపోయినా ఇసుమంత కూడా మారలేదని తనను వదిలి పోతున్న పార్టీ నేతల గురించి మీడియా ప్రతినిధులు ప్రస్తావించినప్పుడు చేసిన వ్యాఖ్యలే నిరూపిస్తున్నాయి. ఎవరు పోయినా పర్వాలేదని.. ప్రజల...

కుక్కలకు వల వేశారు.. కాంతి రాణా కోర్టుకెళ్లారు !

హీరోయిన్ జెత్వానీ కేసులో పరారీలో ఉన్న కుక్కల విద్యాసాగర్ ను పోలీసులు అరెస్టు చేశారు. డెహ్రాడూన్ లో దాక్కుని తన స్నేహితుడి ఫోన్ వాడుతున్న ఆయనపై నిఘా పెట్టి పోలీసులు పట్టుకున్నారు....

బీజేపీ నేతలు మనుషులైతే చంద్రబాబును తిట్టాలి : జగన్

జగన్ రెడ్డి బీజేపీ నేతలకు పెద్ద టెస్టే పెట్టారు. బీజేపీ నేతలు .. మనషులు అయితే చంద్రబాబును తిట్టాలట. బహుశా.. ఆయన అధికారంలో ఉన్నప్పుడు .. తనకు గిలిగింతలు పెట్టడానికి అందరూ తిట్టారు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close