బాబు హయాంలో పోలవరం అవకతవకలపై ఢిల్లీ హైకోర్టులో జనసేన నేత ఫిర్యాదు

చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు లో రకరకాల అవకతవకలు జరిగాయంటూ ఎప్పటినుండో ఇతర రాజకీయ పార్టీలు విమర్శలు చేస్తూ వస్తున్నాయి. అయితే, దీనిమీద ఇప్పటివరకు ఎటువంటి కేసులు నమోదు కాలేదు. అయితే అనూహ్యంగా జనసేన నేత పెంటపాటి పుల్లారావు ఢిల్లీ హైకోర్టులో చంద్రబాబు హయాంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలంటూ పిటిషన్ వేశారు. ఢిల్లీ హైకోర్టు, దీనికి సంబంధించి విచారణ జరిపించాలంటూ కేంద్ర జల వనరుల శాఖ కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో బంతి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి కోర్టులోకి వెళ్లినట్లయింది. ఇందుకు సంబంధించిన వివరాలు బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి తెలియజేశారు.

విష్ణువర్ధన్ రెడ్డి ట్వీట్ చేస్తూ, “ప్రాజెక్టు అంచనాలు పెంచారని,ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ లో అవకతవకలు జరిగాయని పుల్లారావు ఫిర్యాదు కోర్టులో పిర్యాదు . ఢిల్లీలో రాజకీయ ప్రకంపనలు. పప్పులు,నిప్పులు తమ నిజాయితీని నిరూపించుకో వలసిన సమయం ఆసన్నమైంది. పోలవరంలో అవినీతిపై దర్యాప్తు చేయాలని ఢిల్లీ హైకోర్టులో జనసేన నేత పెంటపాటి పుల్లారావు పిటిషన్. పిటిషన్ను ఫిర్యాదుగా స్వీకరించి చర్యలు తీసుకోవాలని కేంద్ర జలవనరుల శాఖ కు ఢిల్లీ హైకోర్టు ఆదేశం.” అని రాసుకొచ్చారు.

మరి ఈ కేసు ఎన్ని మలుపులు తీసుకుంటుందన్నది ఇప్పటి కిప్పుడే ఊహించలేము. అయితే, జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీకి బి-టీం గా కొనసాగుతోంది అంటూ ఇతర రాజకీయ పార్టీల విమర్శలకు మాత్రం ఈ పరిణామం చెక్ పెట్టే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close