సీఎస్, డీజీపీలను దొంగలుగా కోర్టులో నిలబెడుతున్న కిరణ్ రాయల్

తిరుపతి జనసేన నేత కిరణఅ రాయల్ ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, హోమ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై దాఖలు చేసిన ఓ పిటిషన్ సంచలనంగా మారుతోంది. కొన్నాళ్ల కిందట.. రోజా ఇచ్చిన ఫిర్యాదుతో కిరణ్ రాయల్ ను ఇంట్లో అరెస్టు చేశారు. ఆయన ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కానీ ఆయన ఫోన్ నుంచి సమాచారం మొత్తం చోరీ చేశారు. ఆ సమాచారంతో వ్యక్తిగతంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఇదంతా ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, హోమ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కనుసల్లో జరుగుతోందని కిరణ్ రాయల్ పిటిషన్ వేశారు.

ఈ పిటిషన్ విచారణ జరిపిన ఏపీ హైకోర్టు ముగ్గురికీ నోటీసులు ఇచ్చింది. ఒక కేసులో సీజ్ చేసిన తన ఫోన్.. కోర్టు నుంచి దొంగలించి తనను పోలీసులు బెదిరిస్తున్నట్టు కోర్టులో పిటిషన్ వేశారు జనసేన నేత కిరణ్ రాయల్. ఫోన్ లో తన కుటుంబ సభ్యులను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతామని బెదిరిస్తున్నట్టు పిటిషనర్ కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా.. రాజకీయ విమర్శలు చేయకుండా ఉండాలని పోలీసులు బెదిరిస్తున్న విషయాన్ని కోర్టుకు తెలిపారు పిటిషనర్. అంతేకాకుండా.. కాల్ రికార్డ్స్ ను కూడా కోర్టుకు అందించాడు. ఈ క్రమంలో.. ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్ తదుపరి విచారణ ఈ నెల 9కి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.

ఒక్క కిరణ్ రాయల్ కాదు.. తప్పుడు కేసులతో విపక్ష నేతలను అరెస్టు చేయడం.. వారి ఫోన్లను స్వాధీనం చేసుకోవడం.. డేటా చోరీ చేయడం.. వాటితో బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడటం అనేది.. వైసీపీ పోలీసులకు ఓ పెద్ద పనిగా మారింది. చివరికి రఘురామ ఫోన్ నుంచి కూడా ఇలాగే చేశారు. ఈ కేసుపై హైకోర్టు ఇచ్చే రూలింగ్ కీలకం కానుంది. అనేక మంది ఇదే ఆరోపణలపై కోర్టులను ఆశ్రయించే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

వైసీపీకి ‘చిరు’ బెంగ

ఏపీ ఎన్నికల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రచారం ఉదృతంగా సాగుతోంది. ఇప్పటికే...

ఈవారం బాక్సాఫీస్‌: రాంగ్‌ ‘టైమింగ్‌’ కాదుగా!?

ఏపీలో ఎన్నిక‌ల వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. ఎక్క‌డ విన్నా, రాజ‌కీయాల‌కు సంబంధించిన అంశాలే. ఎవ‌రు గెలుస్తారు, ఎవ‌రు ఓడిపోతారు? అనే చ‌ర్చ తీవ్రంగా సాగుతోంది. సినిమా ముచ్చట్ల‌కు కొంత‌కాలం పుల్...

చిరుని క‌లిసిన మారుతి.. ఏం జ‌రుగుతోంది?

చిరంజీవితో ఓ సినిమా చేయాల‌ని మారుతి ఎప్ప‌టి నుంచో అనుకొంటున్నారు. ఇది వ‌ర‌కు వీరి కాంబోలో ఓ సినిమా రాబోతోంద‌న్న వార్త‌లు కూడా హ‌ల్ చ‌ల్ చేశాయి. అంతా ఓకే అనుకొన్న త‌రుణంలో.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close