టార్గెట్ జనసేన సోషల్ మీడియా..! సీఎంపై పోస్టు పెట్టారని జనసేన అరెస్ట్..!

కొద్ది రోజుల క్రితం.. పవన్ కల్యాణ్ అమెరికా పర్యటనకు వెళ్లి.. వందల కోట్ల బ్లాక్‌మనీని వైట్‌గా చేసుకుని వచ్చారని.. వైసీపీ సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం చేసింది. నిజానికి ఇది చాలా సీరియస్ ఇష్యూ. వెంటనే జనసేన నేతలు.. అటు ఆంధ్రాలోనూ.. ఇటు తెలంగాణలోనూ.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ ఇంత వరకూ… ఆ కేసు విషయంలో అతీగతీ లేదు. అదొక్కటే కాదు.. జనసేన నాయకులపై.. శ్రద్ధాంజలి ఫోటోలు.. అసభ్యరాతలు.. లెక్కలేనట్లుగా వైసీపీ సోషల్ మీడియా విభాగం వారు పెడతారు. పవన్ కల్యాణ్‌ను అత్యంత దారుణంగా ట్రోల్ చేస్తారు. ఎన్ని సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా… వారు సైలెంట్‌ అవుతున్నారు కానీ.. ఒక్కరిపై కూడా కేసు పెట్టలేదు.

కానీ.. ప్రభుత్వం తీరును … ప్రజాసమస్యల పట్ల ముఖ్యమంత్రి స్పందనను వ్యతిరేకిస్తూ జనసేన కార్యకర్తలు పోస్టులు పెడితే… ఎవరినీ వదిలి పెట్టడం లేదు. గుంటూరు నుంచి శ్రీకాకుళం వెళ్లి మరీ జనసేన కార్యకర్తల్ని అరెస్ట్ చేస్తున్నారు. ప్రభుత్వాన్ని విమర్శించడం అంటే.. అదేదో పెద్ద నేరమన్నట్లుగా పోలీసులు ప్రత్యేక బృందాలతో రంగంలోకి దిగడం… చూసేవారిని విస్మయం కలిగిస్తోంది. రాజాం నియోజకవర్గం జనసేన కార్యకర్త పనతల హరిని గుంటూరు నుంచి వచ్చి మరీ పోలీసులు అరెస్ట్ అయ్యాడు. సీఎంపై ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర పోస్టులు పెట్టాడని.. ఆయనపై వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారట. అందుకే పోలీసులు అంతకు మించిన డ్యూటీ లేదన‌నట్లు హుటాహుటిన శ్రీకాకుళం వచ్చి హరిని తీసుకెళ్లారు.

ఇప్పటి వరకూ.. జనసేన కార్యకర్తలపై పదుల సంఖ్యలో కేసులు పెట్టారు. అయినా… ఎవరూ బెదరడం లేదు. అంతకు మించి పోస్టులు పెడుతూనే ఉన్నారు. అయితే.. ప్రభుత్వాన్ని వ్యతిరేకించినంత మాత్రాన కేసులు పెట్టడం ఏమిటన్న చర్చ అంతటా నడుస్తోంది. ఒక్క జనసేన కార్యకర్తల్నే కాదు.. టీడీపీ తో పాటు.. ఇతరులను కూడా ఏపీ పోలీసులు వదిలి పెట్టడం లేదు. అంతగా వారు చేస్తున్నది.. చట్ట వ్యతిరేకమే అయితే… వైసీపీ సోషల్ మీడియా విభాగం కూడా చేస్తున్నది.. చట్ట వ్యతిరేకమే. వారు తమకు స్వేచ్ఛ ఉందన్నట్లుగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నా.. పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదనేది అందరి దగ్గర నుంచి వస్తున్న ప్రశ్న..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

దెందులూరు రివ్యూ : లండన్ బాబు వర్సెస్ లోకల్ మాస్ లీడర్

చింతమనేని ప్రభాకర్. తనదైన రాజకీయం చేయడంలో ప్రత్యేకత చూపించారు. మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.కానీ ఓడిపపోయారు. లండన్ లో ఉండే అబ్బయ్య చౌదరి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close