ఇంకో పదేళ్లు ఉమ్మడి రాజధాని కావాలంటున్న జేడీ లక్ష్మినారాయణ !

హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు జూన్ రెండో తేదీన ముగుస్తోంది. ఏపీ నుంచి ప్రధాన పార్టీల నేతలెవరూ పట్టించుకోవడం లేదు కానీ.. జైభారత్ నేషనల్ పార్టీ చీఫ్ లక్ష్మినారాయణ మాత్రం.. మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. విభజన చట్టంలోని సెక్షన్-5ను ప్రస్తావిస్తూ రాష్ట్రపతి భవన్ కు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కనీసం పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలని సెక్షన్-5 చెబుతోందని వెల్లడించారు. కానీ ఏపీ ఇంతవరకు రాజధానిని ఏర్పాటు చేసుకోనందున, మరో పదేళ్ల పాటు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా పొడిగించాలని అంటున్నారు.

రాష్ట్ర విభజన అనంతరం 2014లో ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏకాభిప్రాయంతో అమరావతి రాజధానిని నిర్ణయింారు. మాస్టర్ ప్లాన్ రెడీ చేసుకుని నిర్మాణాలు ప్రారంభించారు. ట్రాన్సిట్ భవనాలు నిర్మించుకున్నారు 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలపడంతో అమరావతి రాజధాని అంశం అగమ్యగోచరంగా మారింది.

చట్టపరమైన సమస్యలతో మూడు రాజధానులు వైసీపీ ఏర్పాటు చేయలేకపోయింది. కనీసం అమరావతిని రాజధానిగా గుర్తించడానికి కూడా సిద్దపడటం లేదు. దీంతో గందరగోళంగా మారింది. నిజానికి ఉమ్మడి రాజధాని అన్న పేరే కానీ ఏపీ వ్యవహారాలు ఏమీ హైదరాబాద్ నుంచి జరగడం లేదు. ఆ ప్రివిలేజ్ ఎప్పుడూ ఏపీ వాడుకోలేదు. కొన్ని భవనాలు తప్ప ఏవీ ప్రభుత్వ ఆధీనంలో లేవు. ఆ భవనాలను వాడుకున్నది కూడా తక్కువే. మరి ఉమ్మడి రాజధానిగా ప్రకటిస్తే వచ్చే లాభమేంటో కూడా జేడీ లక్ష్మినారాయణ తన ట్వీట్‌లో చెప్పాల్సింది. అలాంటిదేమీ చెప్పలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జాక్‌పాట్ కొట్టిన ఎన్వీ ప్ర‌సాద్‌

డ‌బ్బింగ్ సినిమా అంటే వెంట్రుక వేసి, కొండ‌ని లాగే ప్ర‌య‌త్న‌మే. వ‌స్తే.. కొండ‌, పోతే వెంట్రుక‌. కాక‌పోతే... డ‌బ్బింగ్ సినిమాల్ని న‌మ్ముకొని 'బోడిగుండు'తో మిగిలిన వాళ్లుఉన్నారు. కొన్నాళ్లుగా డ‌బ్బింగ్ సినిమాల‌కు కాసులు రాల‌డం...

ఆక్రమణలు కూల్చేస్తే బదిలీ బహుమతా ?

రేవంత్ ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్‌ ఘోరంగగా ఉందన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి. లోటస్ పాండ్‌లో ఫుట్ పాత్ ఆక్రమించేసి కట్టిన షెడ్లను తొలగించిన అధికారిని బదిలీ చేయడంతో ఆక్రమణలు తొలగించడం కూడా తప్పేనా...

కుమార సజ్జల వర్సెస్ సలహాదారు రాజీవ్ కృష్ణ

వైసీపీ క్యాంప్‌లో ముసలం ప్రారంభమయింది. ఘోర ఓటమిపై కారణాలను విశ్లేషించుకోకుండా ఈవీఎంలు అంటూ ఆరోపణలు చేస్తూ టైం పాస్ చేసుకుంటున్నారు. జగన్ ను తప్పుదోవ పట్టించిన సజ్జల వర్గం కూడా...

కర్మ ఈజ్ తాడేపల్లి ప్యాలెస్ !

నువ్ ఏది ఇస్తే నీకు అది తిరిగి వస్తుంది. ఇది గీతలో కృష్ణుడు చెప్పిన కర్మ సిద్ధాంతం. చాలా మంది మనుషులకు కూడా తీరిక ఉండదు కానీ.. ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close