ఇళ‌య‌రాజా బ‌యోపిక్‌లో క‌మ‌ల్ హాస‌న్‌?

ఇటీవ‌లే మ్యూజిక్ మాస్ట్రో ఇళ‌య‌రాజా బ‌యోపిక్ ప‌ట్టాలెక్కిన సంగ‌తి తెలిసిందే. ఇళ‌య‌రాజా పాత్ర‌లో ధ‌నుష్ క‌నిపించ‌బోతున్నాడు. అయితే ఈ సినిమాలో చాలా ఆక‌ర్ష‌ణ‌లు ఉన్నాయి. కొన్ని కీల‌క‌మైన పాత్ర‌ల్లో లెజెండ‌రీ న‌టీన‌టులు ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. క‌మ‌ల్ హాస‌న్ కూడా ఓ పాత్ర పోషించ‌బోతున్నార‌ని టాక్‌. ఇళ‌య‌రాజా – క‌మ‌ల్ మ‌ధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఇళ‌య‌రాజాకు క‌మ‌ల్ వీరాభిమాని. ఇద్ద‌రి క‌ల‌యిక‌లో సూప‌ర్ హిట్ సినిమాలెన్నో వ‌చ్చాయి. ఇప్పుడు `ఇళ‌య‌రాజా` బ‌యోపిక్‌లో క‌మ‌ల్ త‌న వంతు పాత్ర పోషించ‌డానికి రెడీ అయ్యారు. త‌న నిజ జీవిత పాత్ర‌లోనే క‌మ‌ల్ క‌నిపించ‌నున్నార‌ని టాక్‌. అంతేకాదు… ఈ సినిమా కోసం ఆయ‌న స్క్రీన్ ప్లే కూడా అందించ‌నున్నార్ట‌. క‌మ‌ల్ న‌టుడే కాదు. ద‌ర్శ‌కుడు, ర‌చ‌యిత కూడా. అందుకే ఇళ‌య‌రాజాపై త‌న‌కున్న అభిమానంతో, ఈ సినిమాకు స్క్రీప్ట్ అందించ‌డానికి ఆయ‌న ముందుకు వ‌చ్చార‌ని స‌మాచారం. ఇప్ప‌టికే ఈ చిత్ర ద‌ర్శ‌కుడు అరుణ్ మాధేశ్వ‌ర‌న్‌తో క‌లిసి, స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్తి చేశార‌ని తెలుస్తోంది. క‌మ‌ల్ ఇచ్చిన ఇన్ పుట్స్ ఈ క‌థ‌కు చాలావ‌ర‌కూ ఉప‌యోగ‌ప‌డ్డాయ‌ని తెలుస్తోంది. అలా..ఈ సినిమా కోసం న‌టుడిగా, ర‌చ‌యిత‌గా క‌మ‌ల్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నార‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close