కేసీఆర్ చెన్నై టూర్ ఫెయిల్.. డీఎంకే నేత కొత్త స్టేట్‌మెంట్ ఇదే !

మూడో కూటమి టార్గెట్‌గా కేసీఆర్ చెన్నై పర్యటనకు వెళ్లారని టీఆర్ఎస్ కీలక నేత, ఇలా టీఆర్ఎస్ తరపున ఇతర రాష్ట్రాల వ్యవహారాలను చక్కబెట్టే మాజీ ఎంపీ వినోద్ కుమార్ ప్రకటించారు. టూర్ అయిపోయింది.. ఇప్పుడు డీఎంకే లో ఇలా జాతీయ వ్యవహారాలను చక్కబెట్టే ఎంపీ టీఆర్ బాలు ఓ స్టేట్ మెంట్ ఇచ్చారు. అందులో ఎక్కడా కేసీఆర్ ప్రస్తావన రాలేదు కానీ… మూడో కూటమి అనే భావనతో ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బతీయవద్దని ఆయన మమతా బెనర్జీని కోరారు.

మూడో కూటమి మమతా బెనర్జీ నేతృత్వంలో ఉంటుందని.. కాంగ్రెస్ పార్టీ స్థానాన్ని ఆమె ఆక్రమిస్తుందని.. ఇటీవల చెబుతూ వస్తున్నారు. మమతా బెనర్జీ వెనుక ప్రశాంత్ కిషోర్ ఉన్నరు. ప్రశాంత్ కిషోర్ ఇటీవల టీఆర్ఎస్‌తో సన్నిహితంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆయన వ్యూహంలో భాగంగానే చెన్నై వెళ్లారన్న ప్రచారం కూడా ఉంది. ఇప్పుడు మూడో కూటమికి వ్యతిరేకంగా డీఎంకే నుంచి ప్రకటన వచ్చింది. డీఎంకే ప్రస్తుతం యూపీఏలో ఉంది. కాంగ్రెస్ పార్టీకి గట్టి..నమ్మకమైన మిత్రపక్షంగా ఉంది. ఆ పార్టీ నుంచి కాంగ్రెస్ నుంచి దూరం చేసే లక్ష్యంతో కేసీఆర్ రాజకీయం చేశారన్న అభిప్రాయం కూడా బలంగా ఉంది.

ఇలాంటి సమయంలో డీఎంకే.. విపక్షాల ఐక్యతను దెబ్బతీయవద్దని .. ప్రకటన చేయడం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ కూటమి నుంచి స్టాలిన్ బయటుక వచ్చే అవకాశం వంద శాతం లేదని తాజా పరిణామాలతో తేలిపోయింది. అయితే కేసీఆర్ స్టాలిన్‌తో కలిసి నడవడం.. అంటే యూపీఏ కూటమిలో చేరడం.. లేకపోతే జాతీయ రాజకీయాలపై సైలెంట్‌గా ఉండటం అనే రెండు ఆప్షన్లు ప్రస్తుతం ఉన్నాయంటున్నాంటున్నారు. ఇప్పుడు యూపీఏ వైపు వెళ్తే కేసీఆర్‌కే నష్టం కాబట్టి.. వీలైనంత వరకూ కేసీఆర్ జాతీయ రాజకీయాల విషయంలో సైలెంట్‌గా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close