డిల్లీలో ఏపి భవన్ మాదే: కెసిఆర్

తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ మరో సరికొత్త వివాదానికి తెర లేపారు. డిల్లీలో ఉన్న ఆంధ్రప్రదేశ్ భవన్ ఒకప్పటి నిజాం నవాబు కి చెందిన భూముల్లోనే నిర్మించబడింది కనుక అది తెలంగాణాకే చెందుతుందని, కనుక దానిని తమకి అప్పగించాలని కోరుతూ కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కి ఒక లేఖ వ్రాశారు. ఆ భవనాన్ని తమకి అప్పగించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వేరే చోట భవనం ఏర్పాటు చేయాలని కోరారు. ఆంధ్రా భవన్ న్ని తమకి అప్పగిస్తే దానిని కూల్చి వేసి తమ అవసరాలకు తగ్గట్లుగా కొత్త భవనం నిర్మించుకొంటామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కొత్త భవనం నిర్మించుకోవడానికి అవసరమైతే సహాయం చేయడానికి సిద్దంగా ఉన్నామని తెలిపారు.

దాని గురించి రెండు రాష్ట్రాల మద్య వివాదం తలెత్తే అవకాశం ఉందని గ్రహించిన యూపియే ప్రభుత్వం, విభజన చట్టంలోనే అది రెండు రాష్ట్రాలకి విభజించి ఇచ్చింది. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణా ప్రభుత్వం దాని గురించి ఒత్తిడి చేసినప్పటికీ కేంద్రప్రభుత్వం పట్టించుకోలేదు. రెండేళ్ళ తరువాత మళ్ళీ ఇప్పుడు దాని కోసం కేంద్రానికి లేఖ వ్రాయడం విచిత్రంగానే ఉంది. ఆయన వాదనకి బలం చేకూర్చుకోవడానికి నిజాం నవాబు పేరు ప్రస్తావించినప్పటికీ, విభజన చట్టానికే విలువ ఉంటుందని బహుశః కెసిఆర్ కి తెలిసే ఉంటుంది. అది తెలిసి కూడా లేఖ వ్రాశారంటే మరో యుద్ధానికి సిద్దపడుతున్నట్లే భావించవలసి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close