కిరణ్‌రెడ్డిని పిలిచి కిషన్ రెడ్డి ఏం సందేశం ఇచ్చారు !?

తెలంగాణ బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకునే కార్యక్రమానికి చాలా మంది తెలంగాణ నేతలు వచ్చారు .. అయితే ఏపీ నుంచి కిరణ్ కుమార్ రెడ్డిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. మామూలుగా అయితే పెద్దగా పట్టించుకునేవారు కానీ.. కిరణ్ కమార్ రెడ్డి సమైక్యాంధ్ర సమర్థకుడు.. ఆ డిమాండ్ తో సొంత పార్టీ కూడా పెట్టుకున్న వారు. ఆయనను తెలంగాణ బీజేపీ ప్రత్యేక కార్యక్రమానికి ఆహ్వానించడం పైగా.. ప్రసంగించడం కూడా చాలా మందిని ఆశ్చర్య పరిచింది.

ఆయన కూడా తెలంగాణలో బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ, దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలే ఉదాహరణగా చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే బీఆర్ఎస్‌కు వేసినట్లే అని అన్నారు. కాంగ్రెస్‌లో గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ మారటం ఖాయమన్నారు. ప్రైవేటు లిమిటెడ్ కంపేనీ, కుటుంబ పాలన వద్దని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. కలసికట్టుగా పనిచేస్తే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. బీఆర్ఎస్ కారు స్టీరింగ్ ఎంఐఎం చేతులో ఉందంటూ చెప్పుకొచ్చారు.

ఈ అంశాన్ని బీఆర్ఎస్ ప్రత్యేకంగా తీసుకుంటుంది. తెలంగాణను వ్యతిరేకించిన కిరణ్ రెడ్డిని నెత్తి మీద పెట్టుకుని మళ్లీ తెలంగాణకు తీసుకు వస్తున్నారని ఆరోపణలు చేస్తారు. ఎలా చూసినా కిషన్ రెడ్డి ప్రోగ్రామ్ లో కిరణ్ రెడ్డి కనిపించడం కాస్త ఆడ్ గానే ఉంది. కార్యక్రమం ముగియక ముందే సోషల్ మీడియాలో విజయశాంతి పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణను వ్యతిరేకించిన వాళ్లను పిలిచారన్నారు. మొత్తంగా కిరణ్ ను పిలవడం.. బీజేపీలో కొత్త రచ్చకు కారణం అయ్యేలా ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కుదరదన్న తెలంగాణ హైకోర్టు

వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి ఫ్యామిలీకి గుడ్ న్యూస్ లు వరుసగా వినిపిస్తున్నాయి. అప్రూవర్ గా మారిన దస్తగిరి తనను జైల్లో పెట్టి.. పెద్ద ఎత్తున ప్రలోభపెట్టడమే కాకుండా......

‘ఆ ఒక్కటీ అడక్కు’ రివ్యూ: క్లాసిక్ టైటిల్ చెడ‌గొట్టారు

Aa Okkati Adakku Movie review తెలుగు360 రేటింగ్ 2.25/5 -అన్వ‌ర్‌ ఒకప్పుడు అల్లరి నరేష్ నుంచి కామెడీ సినిమా వస్తుందంటే మినిమం గ్యారెంటీ వుండేది. తర్వాత పరిస్థితి మారింది. ఆయనపై కామెడీ కథలు సరిగ్గా...

బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు..!!

సినీ నిర్మాత బండ్ల గణేష్ పై క్రిమినల్ కేసు నమోదైంది. హీరా గ్రూపు సీఈఓ నౌహీరా షేక్ ఫిర్యాదు ఆధారంగా ఉన్నాతాధికారుల ఆదేశాల మేరకు ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బండ్ల...

ఏపీ ఉద్యోగుల చైతన్యం – 4 లక్షలకుపైగా పోస్టల్ బ్యాలెట్స్ !

ఏపీలో పోస్టల్ బ్యాలెట్స్ ఎప్పుడూ లేనంత ఎక్కువగా ఉంటున్నాయి. ఈ సారి ఉద్యోగుల్లో మరింత ఎక్కువగా చైతన్యం కనిపిస్తోంది. ఎన్నికల విధులు... ఎన్నికల సంబంధిత విధుల్లో ఉండేవారు పోస్టల్ బ్యాలెట్స్ వినియోగించుకోవచ్చు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close