వివేకా హత్య కేసు : దర్యాప్తు కొనసాగిస్తే చేరేది జగన్ దగ్గరికే !?

వివేకా హత్య కేసులో సీబీఐ చార్జిషీటులో ఉన్న అంశాలు సంచలనాత్మకంగా మారాయి. ఎలా చంపారు.. ఎందుకు చంపారు.. అన్నది పూర్తి స్థాయిలో సాంకేతిక ఆధారాలతో చార్జిషీటులో పెట్టారు. ఆధారాలేమీ లేవని కేవలం దస్తగిరి వాంగ్మూలం ఆధారంగానే కేసులు పెట్టారని వాదిస్తున్న వారికి ఈ చార్జిషీటుతో షాక్ కొట్టినట్లయింది. అయితే అసలు లోతుగా పరిశీలిస్తే.. ఈ కేసులో దర్యాప్తు కొనసాగిస్తే.. నేరుగా జగన్ దంపతుల వద్దకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోందని నేర పరిశోధనలో నిపుణులైన వారు అంచనాలు వేస్తున్నారు.

అందరి కంటే ముందు భారతి, జగన్‌ దంపతులకు తెలుసు

వివేకా హత్య జరిగిన రోజున మొదట చూసిన వ్యక్తి పీఏ కృష్ణారెడ్డి. అది ఆరున్నర గంటల సమయంలో. కానీ అంతకు ముందే హత్య చేసిన వాళ్లు ఈ సమాచారాన్ని తెలిసిన వారికి పంచుకున్నారు. జగన్ రెడ్డికి ఐదుగంటలకే తెలుసని ఆ రోజున జగన్ ఇంట్లో మీటింగ్‌లో ఉన్న అజేయకల్లాం సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. కృష్ణమోహన్ రెడ్డి కూడా చెప్పారు. అయితే వీరిద్దరూ చెప్పిన సమయాల్లో తేడా ఉంది…కానీ అది అసలు హత్య గురించి బ యటకు తెలియక ముందే. సీబీఐ దర్యాప్తు ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చింది.

జగన్‌, భారతిలకు ముందే తెలుసంటున్న సీబీఐ

గతంలోనూ జగన్, భారతిల ప్రస్తావన సీబీఐ తీసుకు వచ్చింది. కోర్టులో దాకలు చేసిన పలు కౌంటర్లలో వివేకా హత్య గురించి వారికి ముందే తెలుసని.. వారికి ఎలా తెలిసిందో తెలుసుకోవాల్సి ఉందని కూడా చెప్పింది. కానీ దర్యాప్తు ప్రస్తుతానికి అక్కడకు వచ్చింది. ఇప్పటికైతే సుప్రీంకోర్టు దర్యాప్తు కోసం ఇచ్చిన గడువు ముగిసింది. సుప్రీంకోర్టు.. కేసు ఫైల్స్ అన్నింటినీ.. కేసు డైరీని కూడా సీల్డ్ కవర్‌లో అందించాలని ఆదేసించింది ఈ అంశంపై తదుపరి కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.

షర్మిల వాంగ్మూలం ..సూటిగా.. సుత్తి లేకుండా !

అవినాష్ రెడ్డికి సీటు దక్కకుండా తనను పోటీ చేసేలా వివేకా ఒప్పించారని షర్మిల చెప్పారు. కానీ జగన్ మాత్రం ఒప్పుకోలేదని .. ఈ విషయంలోనూ చాలా వివాదాలొచ్చాయని షర్మిల చెబుున్నారు. షర్మిల కుటుంబంలో జరిగిన అన్ని విషయాల గురించి విడమర్చి చెప్పారు. గొడవలు ఉన్నాయన్నారు. షర్మిల సాక్ష్యం ప్రకారం చూస్తే.. ఆమెకు సీటు ఇచ్చేందుకు జగన్ రెడ్డి కూడా నిరాకరించారు. కానీ షర్మిలకు సీటివ్వాల్సిందేనని.. వివేకా ఒత్తిడి చేశారు. ఈ క్రమంలో హత్య జరిగింది.

వివేకా హత్య కేసులో సూత్రధారుల్ని కూడా పట్టుకుంటే .. సీబీఐ ప్రతిష్ట మసకబారకుండా ఉంటుంది. లేకపోతే.. దేశంలో బలవంతులు ఎలాంటి నేరాన్నైనా చేసి తప్పించుకోవచ్చన్న అభిప్రాయానికి ప్రజలు వస్తారు. అది దేశ నేరపరిశోధనా.. న్యాయవ్యవస్థల బలహీనానికి దారి తీస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జూన్6 తర్వాత పెను మార్పులు… షా వ్యాఖ్యల అంతర్యమేంటి..?

జూన్ 6 తర్వాత తెలంగాణలో పెను మార్పులు ఉంటాయన్న అమిత్ షా వ్యాఖ్యల అంతర్యం ఏంటి..? మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రేవంత్ సర్కార్ ను కూల్చుతామని షా వ్యాఖ్యల సంకేతమా..?...

డీజీపీపై వేటు – పరిస్థితులు చేయి దాటిపోయిన తర్వాత !

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికలసంఘం వేటు వేసింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నెలన్నర తర్వాత.. ఎన్నో సార్లు విపక్షాలు డిమాండ్ చేస్తే... ఏపీలో శాంతిభద్రతలు పూర్తి స్థాయిలో అదుపు...
video

భ‌లే ఉన్నాడే టీజ‌ర్‌: ఏదో ‘తేడా’గా ఉందేంటి..?!

https://youtu.be/8JP8u45MqzA మారుతి టీమ్ నుంచి వ‌స్తున్న మ‌రో సినిమా 'భ‌లే ఉన్నాడే'. రాజ్ త‌రుణ్ హీరోగా న‌టించాడు. శివ సాయి వ‌ర్థ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈరోజే టీజ‌ర్ విడుద‌లైంది. టీజ‌ర్ చూస్తే మారుతి...

ఫ్లాష్ బ్యాక్‌: ఆ డైలాగుల‌కు పారితోషికం అడిగిన సూర్య‌కాంతం

పైకి గ‌య్యాళిలా క‌నిపించే సూర్యకాంతం. మ‌న‌సు వెన్న‌పూస‌. ఆమెతో ప‌ని చేసిన‌వాళ్లంతా ఇదే మాట ముక్త‌కంఠంతో చెబుతారు. తిట్లూ, శాప‌నార్థాల‌కు పేటెంట్ హ‌క్కులు తీసుకొన్న‌ట్టున్న సూరేకాంతం.. బ‌య‌ట చాలా చమ‌త్కారంగా మాట్లాడేవారు. అందుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close