ఎమ్మెల్సీ ఎన్నికలలో తెరాస బోణీ, కొండా మురళి ఏకగ్రీవంగా ఎన్నిక

ఎమ్మెల్సీ ఎన్నికలు ఇంకా మొదలవక మునుపే అధికార తెరాస బోణీ కొట్టింది. వరంగల్ నుండి తెరాస అభ్యర్ధిగా బరిలోకి దిగిన కొండా మురళితో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనతో బాటు నామినేషన్ వేసిన ఒకే ఒక్క స్వతంత్ర అభ్యర్ధి తన నామినేషన్ ఉపసహంరించుకోవడంతో కొండా మురళి పోటీ లేకుండా గెలిచారు. మొత్తం 12 స్థానాలకు పోటీ చేస్తున్న తెరాసకు ఇది మంచి శుభసూచకంగా పరిగణిస్తోంది. కొండా సురేఖ వరంగల్ పట్టణం తూర్పు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు ఆమె భర్త మురళి కూడా ఏకగ్రీవంగా ఎన్నికవడంతో కొండా దంపతులిద్దరూ శాసనసభ, శాసనమండలిలో సభ్యులయ్యారు. అందుకు వారు ఛాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా?

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని సర్కార్ ప్రకటించినా... వాలంటీర్లలో అనుమానాలు ఇంకా అలాగే ఉన్నాయి. జులై మొదటి తేదీన సచివాలయం సిబ్బందితో ఫించన్ లు పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం.. వాలంటీర్ల అవసరం...

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

HOT NEWS

css.php
[X] Close
[X] Close