కోటంరెడ్డి అరెస్ట్‌..! మార్పుచూపించిన జగన్..!

సొంత పార్టీ వాళ్లయినా… చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఊరుకునేది లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకూ మాటల్లో చెప్పారు. ఇప్పుడు చేతల్లో కూడా చూపించారు. తమ పార్టీకి చెందిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగిని ఇంటిపై దాడికి పాల్పడినట్లుగా.. కేసు నమోదు కావడంతో.. చట్ట ప్రకారం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో పోలీసులు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.. తెల్లవారుజామునే ఆయనను అరెస్ట్ చేసి న్యాయమూర్తి ముందు ప్రవేశ పెట్టారు. వెంటనే ఆయనకు బెయిల్ వచ్చింది. అయితే.. పోలీసులు ఈ విషయంలో ధైర్యంగా అడుగు ముందుకేసేలా సీఎం జగన్… వారికి ఆదేశాలిచ్చారు.

సహజంగా అధికార పార్టీకి చెందిన నేతలు.. ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఎలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడినా.. పోలీసులు కేసులు పెట్టడానికే మీనమేషాలు లెక్కిస్తారు. ప్రభుత్వ పెద్దలకు ఎక్కడకోపం వస్తుందో.. తమను ఎక్కడ.. ప్రతిపక్ష పార్టీకి చెందిన సానుభూతి పరుల ఖాతాలో వేస్తారోననే భయం చెందుతారు. అంతే కాకుండా… ఆయా నియోజకవర్గాల్లో పోలీసులు… ఎమ్మెల్యేల సిఫార్సులతోనే పోస్టింగులు తెచ్చుకుంటారు. తాము అక్కడికి రావడానికి కారణమైన వారిపై అంత త్వరగా కేసులు పెట్టరు. పై నుంచి ఆదేశాలు వస్తేనే ఏదైనా సాధ్యం. ఈ విషయంపై స్పష్టత ఉంది కాబట్టి వెంటనే.. సీఎం జగన్.. పోలీసులు.. శాంతిభద్రతల అంశంలో రాజీపడకుండా.. ఉండేలా.. ధైర్యం కల్పిస్తూ.. చట్టాలను ఉల్లంఘిస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదనే సందేశాన్ని తన ఆదేశాల ద్వారా పంపారు.

గత ప్రభుత్వంలో చింతమనేనిపై చాలా కేసులు నమోదైనా.. ఒక్క సారి కూడా అరెస్ట్ చేయలేకపోయారు. కనీసం చిన్న కేసుల్లోనూ అరెస్ట్ చూపలేకపోయారు అయితే.. శ్రీధర్ రెడ్డి విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరే వివాదాస్పదంగా ఉంది. ఉద్యోగినిపై దాడి వ్యవహారం సీరియస్ ఇష్యూ అయినా చాలా చిన్న పెట్టీ కేసులు పెట్టారు. దాంతో శ్రీధర్ రెడ్డికి వెంటనే బెయిల్ వచ్చింది. ఈ విషయంపై… విమర్శలు చెలరేగుతున్నాయి. విమర్శలకు జడిసి… పెట్టీ కేసులు పెట్టి అరెస్ట్ చూపించారని అంటున్నారు. అయితే.. తాము చట్ట ప్రకారమే ముందుకు వెళ్లామని.. పోలీసులు అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బిగ్ బ్రేకింగ్ – షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం

షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నందిగామ శివార్ సమీపంలోని ఆల్విన్ ఫార్మా కంపెనీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో...

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

HOT NEWS

css.php
[X] Close
[X] Close