షర్మిలకు తెర వెనుక సపోర్టుగా లగడపాటి !?

మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ హఠాత్తుగా రాజమండ్రిలో ప్రత్యక్షమయ్యారు. ఆయన మాజీ ఎంపీలు ఉండవల్లితో పాటు హర్షకుమార్ తో విడివిడిగా సమావేశం అయ్యారు. లగడపాటి రాజగోపాల్ రాష్ట్ర విభజన జరిగితే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించారు. ఆ మాట మేరకు ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఎక్కువగా ఢిల్లీలోనే ఉంటున్నారు. వ్యాపార వ్యవహారాలు చూసుకుంటున్నారు. అయితే ఏపీకి వచ్చినప్పుడు మాత్రం రాజకీయ స్నేహితుల్ని కలుస్తూ ఉంటారు. ఆ సమయంలో ఆయన రాజకీయంపై చర్చ జరుగుతూ ఉంటుంది. షర్మిలను ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా చేసే ప్రయత్నాల్లో ఉన్నారని తెలిసిన తర్వాత లగడపాటి రాజగోపాల్ రాజమండ్రికి రావడం ఇద్దరు సీనియర్ మాజీ ఎంపీలతో సమావేశం కావడం సహజంగానే ఆసక్తి రేపుతోంది.

హర్షకుమార్ కాంగ్రెస్ లోనే ఉన్నారు. కానీ ఆయన యాక్టివ్ గా లేరు. పీసీసీ చీప్ పదవిని ఆశించారు కానీ దక్కలేదు. షర్మిలను చీఫ్‌గా చేస్తారన్న ప్రచారం తర్వాత ఆయన వ్యతిరేకంగా స్పందించారు. రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి ఊడిగం చేయడానికే ఏపీ కాంగ్రెస్ ఉందా అని ప్రశ్నించారు. అలాగే ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఏ పార్టీలో లేరు. జగన్ కు మద్దతుగా మాట్లాడుతున్నా ఓ పదవి ఇవ్వాలన్న ఆలోచన జగన్‌కు రాలేదు. ఇప్పుడు హర్ష కుమార్ తో పాటు ఉండవల్లి అరుణ్ కుమార్ ను మళ్లీ కాంగ్రెస్ లో యాక్టివ్ అయ్యేలా చూసేందుకు వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు ఒప్పించేందుకు లగడపాటి ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.

షర్మిలకు మద్దతుగా సైలెంట్ గా ఉండిపోయిన కాంగ్రెస్ నేతల్ని లగడపాటి తెరపైకి తెస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. అయితే లగడపాటి రాజగోపాల్ మాత్రం.. అలాంటిదేమీ లేదంటున్నారు. ఎప్పుడు రాజమండ్రి వచ్చినా హర్ష కుమార్ ను.. ఉండవల్లి అరుణ్ కుమార్‌ను కలవడం సహజమేనని చెబుతున్నారు. ఎన్నికలకు ముందు తెర వెనుక ఏంజరుగుతుందో అంచనా వేయడం కష్టమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్, కేటీఆర్ లేకపోతే తెలంగాణ ఏమైపోతుందో !?

బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణను ఎవరో ఎత్తుకుపోతారన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తాము ఉన్నప్పుడంతా స్వర్గం.. ఇప్పుడు నరకం అని ప్రజలకు చెబుతున్నారు. విచిత్రం ఏమిటంటే.. కొత్తగా తాము లేకపోతే...

వాలంటీర్ల లేకపోతే ఇంటింటికి పెన్షన్లు ఇవ్వలేరా ?

ఒకటో తేదీన పించను ఇంటి వద్ద ఇవ్వడానికి ఉద్యోగులు సరిపోరని నమ్మించడానికి ఏపీ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వారు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. పించన్లను బ్యాంక్ అకౌంట్లలో...

కండోమ్స్ ఎక్కువగా వాడేది వారేనా..మోడీకి కౌంటర్

లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రసంగం ఆశ్చర్యపరుస్తోంది. గతానికి భిన్నంగా మాట్లాడుతుండటమే ఇందుకు కారణం.గాంధీ కుటుంబంపై మాత్రమే విమర్శలు చేసే మోడీ గత కొద్ది రోజులుగా రూట్ మార్చారు. కాంగ్రెస్ అకారంలోకి...

ఔను..బీజేపీతో ఒప్పందం ఉందంటోన్న కేటీఆర్..!?

బీజేపీ - బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోన్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాము బీజేపీతో కలిసే ఉన్నామనే పరోక్షంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close