విజయవాడ మెట్రో సర్వేకు వచ్చిన జైకా ప్రతినిధులు

విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమయిన పెట్టుబడి పెట్టేందుకు కేంద్రప్రభుత్వం అంగీకరించకపోవడంతో, జపాన్ కి చెందిన జైకా సంస్థ పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావడంతో దాని ఆర్ధిక సహకారం తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి భూసేకరణ తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించడానికి జైకా సంస్థ ప్రతినిధులు నిన్న విజయవాడకు వచ్చేరు. వారితో కృష్ణా జిల్లా కలెక్టర్, అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్ (ఏఎంఆర్‌సీ) డైరెక్టర్ రాధాకృష్ణ రెడ్డి తదితరులు సమావేశమయ్యారు.

మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణం కోసం అవసరమయిన అన్ని అనుమతుల కోసం తాము ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వచ్చేమని, సాధారణంగా కొన్ని అనుమతులు మంజూరు చేయడానికి ఏడాది కాలం తీసుకొంటుందని, కానీ తమ అభ్యర్ధన మేరకు 9 నెలలోనే అనుమతులు మంజూరు చేయడానికి అంగీకరించినట్లు రాధాకృష్ణ రెడ్డి జైకా ప్రతినిధులకు తెలియజేసారు.

పి.ఎన్.బి.ఎస్.-ఏలూరు రోడ్-నిడమానూరు మధ్య నిర్మించే కారిడార్-2 ప్రాజెక్టుకి టెండర్లు పిలువగా మొత్తం 10 సంస్థలు పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. మరో మూడు నెలలోగా టెండర్లను ఖరారు చేస్తామని తెలిపారు. అలాగే పి.ఎన్.బి.ఎస్‌- బందరు రోడ్డు- పెనమలూరు సెంటర్‌ మధ్య నిర్మించే కారిడార్-1 పనులకు కూడా టెండర్లు పిలిచేందుకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు తెలిపారు. కేవలం నెల రోజుల వ్యవధిలోనే కారిడార్-2కి అవసరమయిన భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయగలమని జైకా ప్రతినిధులకు రాధాకృష్ణ రెడ్డి హామీ ఇచ్చేరు. ఆ సంస్థ ప్రతినిధులకు ప్రాజెక్టు నిర్మాణం కాబోయే ప్రదేశాలను రాధాకృష్ణ రెడ్డి తదితరులు స్వయంగా చూపించి వారు అడిగిన వివరాలను అన్నటినీ అందజేశారు. 2018లోగా ఈ రెండు కారిడార్ల నిర్మాణం పూర్తి చేయాలనుకొంటున్నామని రాధాకృష్ణ రెడ్డి జైకా సంస్థ ప్రతినిదులకి తెలుపగా వారు తాము కూడా అందుకు రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close