బూతులకు నేతలు.. నీతులకు సజ్జలనా !?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతల పరిస్థితి అత్యంత హీనంగా ఉంది. ప్రభుత్వం అయినా.. పార్టీ అయినా గౌరవంగా మాట్లాడటానికి మాత్రం తెర ముందుకు ముఖ్య సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి వస్తున్నారు. ఇక బూతులకు మాత్రం ఆ పార్టీ నేతలను వదులుతున్నారు. ఎవరు ఏం మాట్లాడాలో వైసీపీ పార్టీ ఆఫీసు నుంచి ఆయన తన టీంతో సందేశాలు పంపుతారు. దానికి తగ్గట్లుగా వైసీపీ నేతలు చెలరేగిపోతారు. కానీ ఆయన మాత్రం మీడియా ముందుకు వచ్చి టీడీపీ నేతలు బూతులు మాట్లాడారని.. తాము అలాంటి వాటిజోలికి పోబోమని చెబుతారు. అంటే… బూతులు మాట్లాడిన తమ నేతల్ని కూడా ఆయన తప్పు పట్టినట్లవుతోంది. ఆయన మాత్రం ప్రెస్‌మీట్‌లో ఎక్కడా మాట తూలరు. ప్రజాస్వామ్య భాషే వాడతారు.

ప్రభుత్వంలోనూ అంతే. వివాదాస్పద నిర్ణయాలు.. ప్రకటనలను అధికారులు..అధికారుల సంఘంతో చేయిస్తారు. అందరినీ రాజకీయంగా ఉపయోగించుకుంటారు. ఆయన మాత్రం తనకు ఏ మాత్రం సంబంధం లేనట్లుగా ఉంటారు. పోలీసు అధికారుల సంఘాన్ని రాజకీయంగా ఇంత వరకూ ఎవరూ ఉపయోగించుకోలేదు. కానీ ఇప్పటి వరకూ వైసీపీ నేతల కన్నా ముందే పోలీసు అధికారు ల సంఘం వస్తోంది. వారి తీరుపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఇప్పుడు డీజీపీ గౌతం సవాంగ్ పైనా అదే తరహా చర్చ నడుస్తోంది. ఆయనకు ఒకప్పుడు సిన్సియర్ ఆఫీసర్ అని పేరు ఉండేది. కానీ ఇప్పుడు ఆయన ప్రకటనలు చూసి.. సోషల్ మీడియాలో ఎలా పిలుస్తున్నారో చెప్పడం కష్టం. అన్నీ చేయిస్తోంది సజ్జలే అని అందరికీ తెలుసు. కానీ నిందలన్నీ ప్రభుత్వంలో ఉన్న వారు పడుతున్నారు. కానీ సజ్జల మాత్రం అత్యంత అమాయకంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు.

అటు ప్రభుత్వంలో లీడర్లను ప్రజల్లో చులకన చేసి.. ఇటు ఉన్నతాధికారుల్ని.. వ్యవస్థల్ని కూడా చులకన చేసి.. సజ్జల రామకృష్ణారెడ్డి రాజకీయ లాభం పొందుతున్నారు. తమకు కావాల్సిన పనులు అయ్యేలా చూసుకుంటున్నారు. ప్రత్యర్థుల్ని వేధించగలుగుతున్నారు. కానీ ఇప్పుడు ఆయన వ్యూహంలో భాగమైన వారంతా ప్రత్యర్థి పార్టీకి టార్గెట్లుగా మారారు. కొంత మంది చట్టంలో ఇరుక్కుపోయే పరిస్థితి ఏర్పడింది. ఎవరేమైపోయినా సజ్జలకు మాత్రం పోయేదేమీ ఉండదు. ఎందుకంటే నేరుగా ఆయన చేస్తున్నదేమీ లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close