మద్యం ప్రియులకు షాక్ – 48గంటలు వైన్స్ బంద్

మద్యం ప్రియులకు మరో షాకింగ్ న్యూస్. శనివారం నుంచి 48 గంటల పాటు మద్యం దుకాణాలు మూతబడనున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో వైన్స్ షాపులను క్లోజ్ చేయాలంటూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.

సోమవారం ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే శనివారం సాయంత్రం నుంచే మద్యం షాపులతోపాటు బార్లు కూడా బంద్ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల వేళ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు తలెత్తకుండా చర్యలు చేపట్టే క్రమంలోనే 48గంటలపాటు మద్యం షాపులు మూసివేయాలని పేర్కొంది.

ఎన్నికల సంఘం జారీ చేసిన ఈ ఉత్తర్వులు తెలంగాణాలోని అన్ని జిల్లాలకు వర్తించవు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరిగే జిల్లాల్లో మాత్రమే వైన్ షాపులు, బార్లు మూతబడనున్నాయి. మే 25 నుంచి 27 వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం షాపులు క్లోజ్ అవ్వనున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జాక్‌పాట్ కొట్టిన ఎన్వీ ప్ర‌సాద్‌

డ‌బ్బింగ్ సినిమా అంటే వెంట్రుక వేసి, కొండ‌ని లాగే ప్ర‌య‌త్న‌మే. వ‌స్తే.. కొండ‌, పోతే వెంట్రుక‌. కాక‌పోతే... డ‌బ్బింగ్ సినిమాల్ని న‌మ్ముకొని 'బోడిగుండు'తో మిగిలిన వాళ్లుఉన్నారు. కొన్నాళ్లుగా డ‌బ్బింగ్ సినిమాల‌కు కాసులు రాల‌డం...

ఆక్రమణలు కూల్చేస్తే బదిలీ బహుమతా ?

రేవంత్ ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్‌ ఘోరంగగా ఉందన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి. లోటస్ పాండ్‌లో ఫుట్ పాత్ ఆక్రమించేసి కట్టిన షెడ్లను తొలగించిన అధికారిని బదిలీ చేయడంతో ఆక్రమణలు తొలగించడం కూడా తప్పేనా...

కుమార సజ్జల వర్సెస్ సలహాదారు రాజీవ్ కృష్ణ

వైసీపీ క్యాంప్‌లో ముసలం ప్రారంభమయింది. ఘోర ఓటమిపై కారణాలను విశ్లేషించుకోకుండా ఈవీఎంలు అంటూ ఆరోపణలు చేస్తూ టైం పాస్ చేసుకుంటున్నారు. జగన్ ను తప్పుదోవ పట్టించిన సజ్జల వర్గం కూడా...

కర్మ ఈజ్ తాడేపల్లి ప్యాలెస్ !

నువ్ ఏది ఇస్తే నీకు అది తిరిగి వస్తుంది. ఇది గీతలో కృష్ణుడు చెప్పిన కర్మ సిద్ధాంతం. చాలా మంది మనుషులకు కూడా తీరిక ఉండదు కానీ.. ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close