మ‌హేష్‌.. అమెరికా షెడ్యూల్ లేపేశాడా?

క‌రోనా వ‌ల్ల క‌థ‌లు మార్చుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చేసింది. గ్రూపు డాన్సులు లేవు. లిప్ లాక్కులు డౌటే. ఫారెన్ షెడ్యూళ్లు.. పూర్తిగా ప‌క్క‌న పెట్టాల్సిందే. స్క్రిప్టులో అలాంటి అవ‌కాశాలు లేకుండా చూసుకోవ‌డం ద‌ర్శ‌కుల ప్రాధ‌మిక బాధ్య‌త అయిపోయింది. `స‌ర్కారు వారి పాట‌` కూడా ఇందుకు మిన‌హాయింపు కాదు.

మ‌హేష్ బాబు – ప‌ర‌శురామ్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. ఈ స్క్కిప్టుని ఇప్ప‌టికే చాలా సార్లు మార్చాడు ప‌ర‌శురామ్. క‌రోనా వ‌ల్ల ఇప్పుడు ఇంకోసారి మారింది. క‌థ ప్ర‌కారం.. కొంత‌భాగం అమెరికాలో షూటింగ్ జ‌ర‌గాలి. నిజానికి ఆ షెడ్యూలే చాలా కీల‌కం. ఓ బ్యాంకు ద‌గ్గ‌ర వంద‌ల కోట్లు అప్పు చేసి విదేశాల‌కు పారిపోతాడు విల‌న్‌. అలాంటి విల‌న్‌ని ఇండియాకి ర‌ప్పించి, అప్పు వ‌సూలు చేయిస్తాడు హీరో. క‌నీసం 40 శాతం షూటింగ్ అమెరికాలో జ‌ర‌గాలి. ఇప్పుడు ఆ స‌న్నివేశాల్ని మార్చుకుని రాసుకోవాల్సివ‌చ్చింది. కొత్త స్క్రిప్టు ప్ర‌కారం షూటింగ్ అంతా ఇండియాలోనే జ‌ర‌గ‌బోతోంది. మ‌హేష్ స‌ల‌హాతోనే ఫారెన్ షెడ్యూల్ మొత్తం లేపేశార‌ని, దానికి త‌గ్గ‌ట్టు ఇండియాలోనే ఆ భాగాన్ని తెర‌కెక్కిస్తార‌ని స‌మాచారం. మ‌హేష్‌సినిమా అనే కాదు, మిగిలిన సినిమాలూ ఇప్పుడు ఇదే బాట ప‌డుతున్నాయి. ఇదంతా కరోనా ఎఫెక్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close