అజ్ఞాతంలోకి మల్లాది విష్ణు?

విజయవాడలో స్వర్ణ బార్ అండ్ రెస్టారెంట్ లో కల్తీ మద్యం త్రాగి ఐదుగురు వ్యక్తులు మరణించిన కేసులో పోలీసులు కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు మల్లాది విష్ణుని కూడా నిందితుడిగా చేర్చి అరెస్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు రావడంతో ఆయన నిన్నటి నుండి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. ఆ బార్ తో తనకు ఎటువంటి సంబంధము లేదని మొదట ఆయన వాదించారు. కానీ ఆయన 2014 ఎన్నికలలో తన అఫిడవిట్ లో ఆ బార్ లో తనకు వాటా ఉందని పేర్కొన్నారు. నగర పోలీసులు దాని ఆధారంగానే ఆయనపై కేసు నమోదు చేశారు. ఇది కాకుండా ఆయన కుటుంబీకుల పేరిట గవర్నర్ పేటలో స్వర్ణమయి బార్, గాంధీ నగర్ లో ఖుషీ బార్, కృష్ణ లంకలో స్వర్ణ బార్ ఉన్నాయని ఎక్సయిజ్ అధికారులు చెపుతున్నారు. కనుక ఈ కల్తీ మద్యం కేసులో మల్లాది విష్ణుని పోలీసులు అరెస్ట్ చేయడం ఖాయమని తెలుస్తోంది.

“మల్లాది విష్ణు రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని నిలదీస్తున్నారు కనుకనే ఆయనపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పూనుకొంటోందని” ఆరోపించిన పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి కూడా మళ్ళీ అదే మాటను గట్టిగా అనలేకపోతున్నారిప్పుడు. కల్తీ మద్యం అమ్మిన స్వర్ణ బార్ అండ్ రెస్టారెంట్ మల్లాది విష్ణుదేనని పోలీసులు స్పష్టమయిన ఆధారాలు చూపిస్తున్నారు కనుక ఇప్పుడు ఆయనను వెనకేసుకురాలేని పరిస్థితి ఏర్పడింది. రఘువీరా రెడ్డి ఇంతకు ముందు ఆయనకు మద్దతుగా మాట్లాడిన మాటలను కూడా వెనక్కి తీసుకొని ఆయనను పార్టీలో తొలగించవలసిన పరిస్థితి కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సజ్జల రాజీనామా చేస్తే ఏమవుతుంది !?

ఏపీలో సలహాదారులకు కూడా కోడ్ వర్తిస్తుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం ప్రభుత్వ సలహాదారు రాజకీయ వ్యవహారాలు మాట్లాడేందుకు వీలు లేదు. అయినా సజ్జల...

మంత్రి బుగ్గన సిబ్బంది బెదిరింపులు…మహిళ సూసైడ్..!?

ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సిబ్బంది అత్యుత్సాహం ఓ మహిళా నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి.కనీస మానవత్వం చూపకుండా బెదిరింపులకు దిగడంతో ఓ నిరుపేద మహిళా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కోనసీమ జిల్లా కొత్తపేటకు...

మేనిఫెస్టో మోసాలు : జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ ఏది బ్రో !

చంద్రబాబునాయుడు నిరుద్యోగ యువత కోసం నిరుద్యోగ భృతి పథకం పెట్టి.. భృతి ఇచ్చి.. ఇలా భృతి తీసుకునేవాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి ఎప్పటికప్పుడు ఉద్యోగాలిచ్చేలా వ్యవస్థను సృష్టిస్తే.. జగన్ ెడ్డి ఏపీకి...

అప్రూవర్ గా శరత్ చంద్రారెడ్డి…కవితకు బెయిల్ దక్కేనా..?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ అధికారుల వద్ద అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి తాజాగా సీబీఐ అధికారుల ముందు కూడా అప్రూవర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close