ట్యాంపరింగ్ తో గెలిచిన బిజెపి, రాష్ట్రాలని కబళిస్తోందన్న మాయావతి వ్యాఖ్యలపై చర్చ

బహుజన సమాజ్ వాది పార్టీ నేత మాయావతి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీ 2019 లోక్సభ ఎన్నికలలో ఈవీఎం ట్యాంపరింగ్ చేసి గెలిచింది అని, అలా గెలిచి ఇప్పుడేమో బిజెపియేతర రాష్ట్రాలని కబళిస్తోందని మాయావతి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల పై సర్వత్రా చర్చ జరుగుతోంది.

ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతున్న రాజకీయ సంక్షోభం సంగతి అందరికి తెలిసిందే. ఈ సంక్షోభానికి కారణం బిజెపియే అని మాయావతి అన్నారు. అదే విధంగా గోవాలో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బిజెపి లోకి విలీనమయ్యారు. 15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో 10 మంది బిజెపిలో చేరడం తో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ లు సైతం బిజెపి ప్రజాస్వామ్యాన్ని చంపేస్తుంది అంటూ విమర్శలు చేయడం తప్ప మరేమీ చేయలేక పోతున్నారు. అయితే ఇలా గోవా , కర్ణాటక అంటూ ఒక రాష్ట్రం తర్వాత మరొక రాష్ట్రాన్ని బిజెపి టార్గెట్ చేస్తోందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. దేశం మొత్తం 29 రాష్ట్రాలలో జెండా ఎగురవేయాలి అన్న మిషన్ తో బిజెపి పనిచేస్తోందని, రాజకీయంగా బలపడాలి అన్న ఆశ తప్పు కానప్పటికీ దానికోసం సమాఖ్య స్ఫూర్తిని దెబ్బ తీయడం మంచిది కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలలో కూడా కొంతవరకు ఇదే రకమైన చర్చ జరుగుతోంది.

అంతేకాకుండా, ఎన్నికల లో బిజెపి ఈవీఎం ట్యాంపరింగ్ చేసి గెలిచిందని పదేపదే మాయావతి ఆరోపణలు చేస్తున్నారు. దీనికి చాలామంది రాజకీయ నాయకుల నుండి మద్దతు రానప్పటికీ, ప్రజలలో కూడా ఒక వర్గం లో ఈవీఎం ట్యాంపరింగ్ మీద అనుమానాలు ఉన్న సంగతి తెలిసిందే. మొత్తం మీద బిజెపి ఈవీఎం ట్యాంపరింగ్ చేసిందన్న వ్యాఖ్యల మీద, విపక్షాలని అణిచేస్తూ రాష్ట్రాలను కబళించి వేయడానికి బిజెపి ప్రయత్నిస్తోందన్న మాయావతి వ్యాఖ్యల మీద చర్చ జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close