మీడియా వాచ్ : ఆ రెండు చానళ్లకూ రేవంత్ ప్రతిపక్షనేతే..!

ఎంపీ అయిన రేవంత్ రెడ్డిని డ్రోన్ కేసు పెట్టి అరెస్ట్ చేశారు. దాదాపుగా పది రోజులు అవుతోంది. బెయిల్ కూడా లేదు. ఆయనపై పెట్టిన డ్రోన్ కేసులో గరిష్టంగా శిక్ష నెల రోజులు. ఇలాంటి పరిస్థితిని తెలంగాణలోని ఏ మీడియా ప్రశ్నించడం లేదు. మిగతా మీడియా మొహమాటానికి పోయి… ఒకటి అరా వార్తలిస్తున్నాయి. రెండు చానళ్లు మాత్రం హోరెత్తిస్తున్నాయి. అయితే అది పాజిటివ్ గా కాదు. నెగెటివ్ గా. రేవంత్ జైల్లో ఉండే ఈ మీడియా మాత్రం… ఆయన భూకబ్జాదారుడని.. డ్రోన్లు అక్రమంగా ఎగరేస్తారని తీర్పులు చెబుతూ…ప్రసారాలు చేసేస్తున్నాయి.

సాధారణంగా చట్ట విరుద్ధమైన పనులు జరిగినప్పుడు బాధితుల పక్షాన మీడియా నిలబడుతుంది. ఇక్కడ మాత్రం రేవంత్ నే దోషిగా తేల్చి ప్రసారాలు చేసేస్తోంది. ఓ ఎంపీని అరెస్ట్ చేయడానికి కొన్ని పద్దతులు ఉంటాయి. అవేమీ లేదు. అసలు అది నిరూపించదగిన కేసు కాదని.. న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో.. ఎవరైనా రేవంత్ కు వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం.. సమయం పట్టింపులు లేకుండా ప్రసారం చేస్తున్నాయి. జగ్గారెడ్డి , వీహెచ్ లాంటి వాళ్లు రేవంత్ పై ఫైరయినా… అరగంట అయినా ప్రసారం చేసేస్తున్నాయి.

మరో వైపు జాతీయ మీడియా మాత్రం.. ఓ ఎంపీని అక్రమంగా నిర్బంధించారని చెబుతున్నాయి. కాంగ్రెస్ స్థానిక నేతలు.. రేవంత్ ను.. ఒంటరిని చేయగా..ఢిల్లీ నేతలు మాత్రం..ఆయన కోసం ప్రత్యేక లాయర్ల బృందాన్నే పంపించారు. మొత్తానికి కొంత మందికే కాదు.. వారి అధీనంలో ఉన్న మీడియాకు కూడా రేవంత్ ప్రతిపక్ష నేతగా మారిపోయారు. తమ ప్రతిపక్ష నేతపై.. మీడియా ప్రమాణాలు లాంటివి ఏమీ పట్టించుకోకుండా .. పోరాటం చేస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close