బుగ్గనకు ఎన్నికలు కాదు.. బడ్జెట్ బ్యాలెన్సే పరీక్ష..!

బడ్జెట్‌కు ముందు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి టెన్షన్ పడుతున్నారు. స్థానిక ఎన్నికల్లో కర్నూలు జిల్లా బాధ్యతను అనుచరులకు అప్పగించేసి ఆయన ఢిల్లీ పయనమయ్యారు. అక్కడ నిధులు ఇచ్చే అవకాశంఉన్న ప్రతీ కేంద్రమంత్రిని కలుస్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి..రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రెవెన్యూ లోటుకు నిధులు మంజూరు చేయాలని కోరారు. స్థానిక ఎన్నికలు నిర్వహిస్తున్నామని.. ఆర్థిక సంఘం నిధులు … రూ. ఐదు వేల కోట్లు వెంటనే ఇవ్వాలని కూడా కోరారు. అంతకు ముందు 15వ ఆర్థికసంఘం చైర్మన్ ఎంకే సింగ్‌తోనూ భేటీ అయ్యారు. రాష్ట్ర లోటు బడ్జెట్ గురించి.. తమకు ఎక్కువ కేటాయింపులు వచ్చేలా చూడాలని కోరారు.

కేంద్ర జలశక్తిమంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ని కలిసి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి పెండింగ్ నిధులునుకోరారు. అయితే.. కేంద్రం ఎన్ని సార్లు అడిగినా ఒకటే సమాధానం చెబుతోంది. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో… ఇప్పటికే.. గత ప్రభుత్వం ఖర్చు పెట్టిన నిధులు ఇచ్చేసింది. ప్రస్తుత ప్రభుత్వం ఖర్చు పెడుతున్నదేమీ లేదు కాబట్టి… పెండింగ్ ఏమీ లేవు. 2014 కన్నా ముందు ఖర్చు పెట్టిన నిధులు ఇవ్వాలని రాష్ట్రం కోరుతోంది.కానీ వాటి ఆడిటింగ్ మాత్రం సాధ్యం కావడం లేదు. ఆ నిధులు రావాలంటే.. ఆడిటింగ్ జరగాల్సిందేనని కేంద్రం అంటోంది. ఇక కేంద్ర ప్రభుత్వం .. పన్నుల్లో వాటాలు తప్ప.. ఏపీకి ప్రత్యేకంగా రూపాయి కూడా కేటాయించే పరిస్థితుల్లో లేదు. బడ్జెట్‌లో కూడా చెప్పలేదు. లోటు బడ్జెట్ ను.. పూరించే అవకాశమే లేదు.

అయినప్పటికి.. 31వ తేదీన బడ్జెట్ పెట్టాలనుకుంటున్న బుగ్గన… నవరత్నాలన్నింటికీ తగినట్లుగా నిధులు కేటాయించాలంటే.. ఎంతో కొంత… కేంద్రం నుంచి సాయం పొందాలని అనుకుంటున్నారు. ఇప్పటికే .. దాదాపుగా 30వేల కోట్ల లోటులోకి ఏపీ వెళ్లిపోయింది. ఆర్థిక వనరులు తగ్గిపోతున్న కారణంగా.. దీన్ని భర్తీ చేసుకోవడం కష్టంగా ఉంది. బుగ్గన ఢిల్లీ నుంచి ఎలాంటి హామీలు పొందారో బయటకు రావాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close