‘మీలో ఎవరు కోటీశ్వరుడు’లో కోటి రూపాయలప్రశ్నదాకా చేరుకున్నారు!

హైదరాబాద్: ‘మా’ టీవీలో నాగార్జున హోస్ట్ చేస్తున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ గేమ్ షోలో నిన్న కొత్త రికార్డ్ నమోదయింది. ఇప్పుడు నడుస్తున్న 3వ సీజన్‌తో సహా ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు ఎవరూ కోటి రూపాయల ప్రశ్నదాకా చేరుకోని సంగతి తెలిసిందే. అయితే నిన్న మొట్ట మొదటిసారిగా అమరనాథ్-లోహిత అనే భార్యాభర్తల జంట కోటి రూపాయల ప్రశ్నదాకా చేరుకుని రికార్డ్ సృష్టించింది. అయితే ఆ కోటి రూపాయల ప్రశ్నకు సమాధానం తెలియకపోవటంతో రు.50 లక్షలతో క్విట్ అయ్యారు. ఈ సందర్భంగా ఆ భార్యాభర్తలను నాగార్జున సత్కరించారు. అమరనాథ్ తన అభిమాన నటుడు ప్రభాస్‌ అని ముందే చెప్పి ఉండటంతో నాగార్జున చివరలో ప్రభాస్‌‍కు ఫోన్ చేసి అమరనాథ్‌తో మాట్లాడింపజేశారు. అమరనాథ్ ఐటీ ఉద్యోగి అయినప్పటికీ, ఇన్ఫోసిస్‌లో ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. ప్రస్తుతం ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ప్రస్తుతం మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమాన్ని జంటలతో నిర్వహిస్తుండటంతో ఇతనితోపాటు ఇతని భార్య లోహిత కూడా క్విజ్‌లో పాల్గొన్నారు. వీరికి పెళ్ళి అయ్యి ఒక నెలే కావటంతో రు.50 లక్షలు గెలుపుపై వీరికి, వీరి కుటుంబసభ్యులకు ఆనందానికి అవథులు లేకుండా పోయాయి.

రు.50 లక్షలు గెలుచుకున్నాకూడా అమరనాథ్‌కు దానిలో దాదాపు 35శాతం పన్నులుగా పోయి మిగిలినదే చేతికందుతుంది. ఇంతకుముందు ఈ కార్యక్రమంలో అత్యధికంగా రు.25 లక్షలు ప్రైజ్ మనీ గెలుచుకున్నది ఒకే ఒక్క వ్యక్తి మాత్రమే. ఆయన 60 ఏళ్ళు పైబడిన ఒక అంధుడు కావటం విశేషం. ఆయన పేరు రావణ్ శర్మ.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

విజయమ్మ బర్త్‌డే విషెష్ : షర్మిల చెప్పింది.. జగన్ చెప్పాల్సి వచ్చింది !

వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజును వైఎస్ జగన్ గత మూడేళ్లలో ఎప్పుడూ తల్చుకోలేదు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు కూడా పెట్టలేదు. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో జగన్ కు...

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోచేరిన కేటీఆర్ బావమరిది..!

లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close