జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా మహబూబా ముఫ్తీ

జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ ఈరోజు ఉదయం డిల్లీలో మరణించడంతో ఆయన స్థానంలో ఆయన కుమార్తె మహబూబా ముఫ్తీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. అధికార పిడిపికి చెందిన 29 మంది శాసనసభ్యులు ఆమెను ఈరోజు తమ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకొని ఆమె నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్లు తెలియజేస్తూ రాష్ట్ర గవర్నర్ ఎన్.ఎన్.వొహ్రాకి లేఖ ఇచ్చేరు.

పిడిపి ప్రభుత్వంలో సంకీర్ణ భాగస్వామిగా ఉన్న బీజేపీ కూడా ఆమె ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే తమకు ఎటువంటి అభ్యంతరమూ లేదని ముందే ప్రకటించింది. కనుక జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రిగా 56 ఏళ్ల మహబూబా ముఫ్తీ సయీద్ త్వరలోనే బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆమె తండ్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్ అంత్యక్రియలు ముగిసిన తరువాత ఆమె రాష్ట్ర 13వ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆమె ప్రస్తుత మంత్రివర్గాన్నే కొనసాగించవచ్చని సమాచారం. మహబూబా ముఫ్తీ ప్రస్తుతం పార్లమెంటు సభ్యురాలుగా ఉన్నారు కనుక ఆమె తన ఎంపి పదవికి రాజీనామా చేయవలసి ఉంటుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆరు నెలలోగా రాష్ట్ర శాసనసభ లేదా విధానసభకు ఎన్నిక కావలసి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close