కేసీఆర్ కు షాక్ – సీబీఐకి ఎమ్మెల్యేలకు ఎర కేసు !

తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఏదీ కలసి రావడం లేదు. బీజేపీపై యుద్ధానికి తాను సృష్టించుకున్న ఆయుధం ఇప్పుడు బూమెరాంగ్ అయిపోయింది. ఈ కేసులో సిట్ ఏర్పాటు చేసి బీజేపీ అగ్రనాయకులకు నోటీసులు జారీ చేసి హడావుడి చేద్దామనుకున్నారు. అన్నంత పని చేశారు. ఇక మోదీ, అమిత్ షాలకూ నోటీసులు వెళ్తాయన్న ప్రచారాన్ని సోషల్ మీడియాలో చేశారు. చివరికి ఈ కేసు సీబీఐ చేతికి వెళ్లింది. ఈ కేసును సీబీఐకి ఇవ్వాలంటూ.. బీజేపీ ,నిందితులు వేసిన పిటిషన్ పై సుదీర్ఘ విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. నిర్ణయాన్ని వారికి అనుకూలంగా ఇచ్చింది. కేసును సీబీఐకి బదిలీ చేయాలని ఆదేశించింది.

మునుగోడు ఎన్నికల ప్రచారం జరుగుతూండగా.. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో నలుగురు ఎమ్మెల్యేలు.. ముగ్గురు ఇతర వ్యక్తులతో కలిసి ఉండగా పోలీసులు ట్రాప్ చేశారు. ఆ ముగ్గురూ ఆ నలుగురు ఎమ్మెల్యేలతో బేరం ఆడటానికి వచ్చారని కేసు పెట్టారు. స్వయంగా రోహిత్ రెడ్డినే ఈ కేసు పెట్టారు. తమను ప్రలోభ పెట్టడానికి వచ్చారని కేసు పెట్టారు. వీరి వెనుక చాలా పెద్ద తలకాయలు ఉన్నాయని .. తెలంగాణ సర్కార్ సిట్ వేసింది. బీఎల్ సంతోష్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఇతరులకూ జారీ చేసింది. కానీ ఎవరూ విచారణకు రాలేదు.

అందరూ సిట్ కుట్రపూరిత విచారణ అని హైకోర్టుకు వెళ్లారు. ఇప్పుడు కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు సీబీఐ అసలు ఎవరు బేరం పెట్టారు..ఎవరు కొనుగోలు చేయబోయారు.. ఎంత డబ్బులు ఇస్తామన్నారు లాంటివన్నీ తేల్చనుంది. ఈ కేసులో అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ కేసులో ఎమ్మెల్యేలకు బేరం పెట్టిన వ్యక్తిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నందకుమార్ రోహిత్ రెడ్డి బిజినెస్ పార్టనర్ అని తేలింది. ఇదే కేసులో ఈడీ కూడా రంగంలోకి దిగి విచారణ జరుపుతోంది.

ఢిల్లీ లిక్కర్ స్కాంకు పోటీగా ఈ కేసును తెరపైకి తెచ్చినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కేసు కూడా.. టీఆర్ఎస్ నేతలకు గుదిబండగా మారనుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి : జగన్

జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు. టీడీపీ హయాం కన్నా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close