తెలంగాణలో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

హైదరాబాద్: చెదురుమదురు ఘటనల మధ్య తెలంగాణలో ఇవాళ స్థానికసంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలలోని 6 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 8 గంటలనుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఓట్ల లెక్కింపు ఈ నెల 30న జరుగుతుంది. తొమ్మిది జిల్లాలలోని 12 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా ఆరు ఏకగ్రీవమయ్యాయి. రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలలో రెండేసి స్థానాలకు, నల్గొండ, ఖమ్మం జిల్లాలలో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల పోలింగ్ కేంద్రం వద్ద, నల్గొండలో పోలింగ్ కేంద్రం వద్ద స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నాయి. నల్గొండ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది. తెలుగుదేశం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఫిర్యాదు మేరకు ఈసీ ఈ చర్య చేపట్టింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘లెజెండ్’ ఎఫెక్ట్.. జయం మనదే

బాలకృష్ణ లెజెండ్ సినిమా ఈనెల 30న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా పదేళ్ళు పూర్తి చేసుకున్న నేపధ్యంలో రీరిలీజ్ కి పూనుకున్నారు. ఈ సినిమా 2014 ఎన్నికల ముందు వచ్చింది. ఆ...

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close