రవి : నష్టపోయిన వాళ్లే ఇష్టంగా ఓట్లేశారు.. ! మోడీ అసాధ్యుడే..!

ప్రధానమంత్రి నరేంద్రమోడీ వియయోత్సవ ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలు కొత్త ఆలోచనను బయటపెట్టాయి. కార్పొరేట్ రంగాన్ని ఆయన.. పేదలను.. పేదరికం నుంచి బయటపడేసే వ్యవస్థగా భావిస్తున్నారు. అందుకే.. కార్పొరేట్ రంగానికి చేయూతనివ్వాలని అనుకుంటున్నారు. ఈ విషయాన్ని చాలా స్పష్టంగానే చెప్పారు.

“కార్పొరేట్లు” దేశానికి చేస్తున్న సేవ చాలా గొప్పదా..?

దేశంలో కార్పొరేట్ రంగానికి సాయం చేయడం అంటే… ధనవంతులకు సాయం చేయడం అన్న అభిప్రాయం ఉంది. కానీ మోడీ ఇప్పుడు దాన్ని మార్చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే.. కార్పొరేట్ రంగం మీద ఆధారపడి… లక్షల ఉద్యోగులు ఉంటున్నారు. ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది. అయితే.. కార్పొరేట్ రంగంపై… ప్రజల్లో … అపోహలు ఉన్నాయని… కాంగ్రెస్ లాంటి పార్టీలు వాటిని పెంచి పోషించాయని.. బీజేపీ భావిస్తోంది. ఇంతవరకూ ఏ రాజకీయ పార్టీకూడా ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వం సహకరించాలని బహిరంగంగా చెప్పిన సందర్భం లేదు . కానీ మోడీ చాలా ధైర్యంగా కార్పొరేట్ రంగానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. “ఈ దేశం లో రెండే జాతులున్నాయి …ఒకటి పేదలు …రెండోది పేదలను పేదరికం నుంచి బైట పడేయడానికి కృషి చేస్తున్న జాతి” …అని మోడీ ప్రకటించారు. పేదలను పేదరికం నుంచి బైట పడేయడానికి కృషి చేస్తున్న జాతి… కార్పొరేట్లే..!

పేదరికం తగ్గిస్తున్నది కార్పొరేట్ కంపెనీలేనా..?

మోడీ తన రాజకీయ విధానం ఏమిటో అస్సలు దాచుకోలేదు . స్పష్టంగా నే చెప్పారు . రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్లలో అనిల్ అంబానీకి మోదీ లబ్ది చేకూర్చారని కాంగ్రెస్ , ఇతర ప్రతిపక్షాలు , మీడియా లో ఒక వర్గం మోడీని తప్పు పట్టింది . మోడీ తన విజయోత్సవ సభలో పరోక్షంగా వివరణ ఇచ్చారు . ప్రైవేటు రంగం మాత్రమే ఈ దేశం లో పేదరికాన్ని తగ్గిస్తుందని తేల్చి చెప్పారు . అందుకే ప్రైవేటు రంగానికి ప్రభుత్వం సహాయం , సహకారం అందించాలన్నారు . మన దేశం లో సామాజిక అధ్యయన కారులు ఇంకా ఇరవయ్యో శతాబ్దం ఆలోచనలకే పరిమితం అయ్యారని … వాళ్ళు అసలు ఏమాత్రం మారలేదని మోడీ ఎద్దేవా చేశారు .

మోడీ విధానాలతో నష్టపోయిన వార్ని ఎలా ఓటర్లుగా మార్చుకున్నారు..?

ఆకలితో ఉండి కూడా ఈ దేశానికి అన్నం పెడుతున్న రైతులూ , అసంఘటిత రంగం లో ఉన్న నలభై కోట్ల మంది కార్మికులూ , సక్రమంగా పన్ను చెల్లిస్తూ , చట్టానికి బద్ధులై బతుకుతున్న మధ్యతరగతి ప్రజలూ …వీళ్లంతా ఈనాటి బీజేపీ విజయానికి కారకులు. . నిజానికి మోడీ విధానాల వల్ల నష్టపోయింది ఈ వర్గాలే . పెద్ద నోట్ల రద్దు …జి ఎస్ టి …వంటి నిర్ణయాల వల్ల ఈ వర్గాలే బాగా నలిగిపోయాయి . బాధిత వర్గాలనే తన ఓటు బ్యాంకుగా మార్చుకోవడం నిజంగా మోడీ సాధించిన అద్భుత విజయం . అందుకు అయన ఎలాంటి వ్యూహం అనుసరించారన్నది వేరే విషయం .

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close