నేషనల్ హెరాల్డ్ కేసు కోసం నేషన్ పే చేస్తున్నదెంతో?

నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ని కోట్లు చేతులు మారాయో…అవి ఎవరి జేబుల్లోకి వెళ్ళాయో ఎవరికీ తెలియదు. కానీ ఆ కేసు పుణ్యమాని గత రెండు వారాలుగా పార్లమెంటు స్తంభించిపోయింది. ఒక్క బిల్లు పాసయితే ఒట్టు. ఈ రెండు వారాలలో పార్లమెంటులో అధికార, ప్రతిపక్షాలు ఒకరినొకరు దూషించుకోవడానికే సరిపోయింది. ఆ తల్లి కొడుకుల సమస్య దేశ సమస్యగా పార్లమెంటు నిర్వహణకు ఎన్ని కోట్లు ఖర్చయ్యాయో తెలియదు. “రాజు వెడలె రవి తేజములరియగా…కుడి ఎడమల్ డాల్ కత్తులు మెరియగా” అన్నట్లుగా ఆ తల్లి కొడుకులిరువురూ కాంగ్రెస్ జీవులందరినీ వెంటబెట్టుకొని ఈరోజు కోర్టుకి కదిలివస్తునప్పుడు వారి భద్రత కోసం భారత ప్రజలు చెమటోడ్చి సంపాదించి కట్టిన పన్నులలో ఎన్ని లక్షలు ఖర్చయ్యాయో ఆ లెక్కలు మోడీ ప్రభుత్వానికే తెలియాలి.

భారతదేశంలో నేటికీ కోట్లాది మంది ప్రజలు ఒక్కపూట తిండికి నోచుకోకపోతున్నా ఇటువంటి మహానేతల రక్షణ కోసం కప్పాలు కట్టక తప్పడం లేదు. అయితే తిండికి నోచుకోని వాళ్ళందరూ అన్యాయం అయిపోతున్నారని అనేసుకోనవసరం లేదు. వారి కోసం ఇందిరా గాంధీ ఆనాడే ‘గరీబ్ హటావ్’ అని నినదించారు. ఇప్పటికీ మన నేతలు ఏదో క్యాచీ పేర్లు పెట్టుకొని నినదిస్తూనే ఉన్నారు. పేదల కోసం అనేక స్కీములు పెడుతూనే ఉన్నారు. కానీ గిట్టని వాళ్ళు ఆ తల్లి కొడుకుల కోసం ఇంత ఖర్చా? ఆ ఈ ‘ఇద్దరు బాధితుల’ కోసం పార్లమెంటు ఇంత బారీ మూల్యం చెల్లించాలా? అని బుగ్గలు నొక్కుకొంటూ తెగ ఫీలయిపోతున్నారు. అయితే నేటి ‘బెయిల్ విజయాన్ని’ ‘ధర్మ విజయంగా’ కాంగ్రెస్ పార్టీ నేతలు అందరూ భావిస్తున్నారు కనుక రేపటి నుంచి వారందరూ రెట్టించిన సమరోత్సాహంతో పార్లమెంటుని స్తంభింపజేయవచ్చును. దానిని ఎవరయినా తప్పుగా భావిస్తే వారి అజ్ఞానానికి ఒక చిర్నవ్వు నవ్వి ఊరుకోవలసిందే. అదే న్యాయం.ధర్మం కూడా!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారంలో పొలిటికల్ గ్లామర్ ఏదీ..?

ఎన్నికలు అనగానే ప్రధాన పార్టీలు సినీ తారల సేవలను ప్రచారంలో ఒకప్పుడు వాడుకునేవి. కానీ, రానురాను ఆ సంప్రదాయం తెరమరుగు అవుతోంది. తమ సేవలను వాడుకొని వదిలేస్తున్నారనే భావనతో ప్రచారాలకు దూరం పాటిస్తున్నారు....

ఎవరీ రామసహాయం రఘురామ్ రెడ్డి..?

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రామసహాయం రఘురాం రెడ్డిని హైకమాండ్ ప్రకటించింది.అనేకపేర్లు తెరమీదకు వచ్చినా అనూహ్యంగా అధిష్టానం రామసహాయం పేరును అభ్యర్థిగా ఖరారు చేయడంతో ఈయన ఎవరు అనే చర్చ జోరుగా జరుగుతోంది....

“సివిల్ సర్వీస్” ఇమేజ్ జగన్ పాలనలో డ్యామేజ్ !

సివిల్ సర్వీస్ అధికారి అంటే ఓ గౌరవం.. ఓ మర్యాద. కానీ ఏపీలో సివిల్ సర్వీస్ అధికారులు చేస్తున్న పనులు చూసి.. కోర్టులు కూడా అసలు మీకెవరు ఉద్యోగం ఇచ్చారయ్యా అని అసహనపడాల్సి...

తీన్మార్ మల్లన్న – ఈ సారి ఎమ్మెల్సీ పక్కా !

తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ ..తెలంగాణ రాజకీయల్లో పరిచయం లేని వ్యక్తి. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ కు సపోర్టుగా ఉన్నారు. ఆయన పేరును కరీంనగర్ లోక్ సభకు కూడా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close