“కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ” రేంజ్‌లో ఒక్క తెలుగు లీడరూ లేడు..!

కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి సీడ్ల్యూసీని పునర్వవస్థీకరించారు. అందులో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కరంటే..ఒక్కరికీ చాన్స్ దక్కలేదు. 23 మందితో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ప్రకటించారు. వీరు కాకాకుండా.. 18 మంది శాశ్వత ఆహ్వానితులు, పది మంది ప్రత్యేక ఆహ్వానితులు కూడా సీడబ్ల్యూసీ జాబితాలో ఉన్నారు. ఈ యాభై మూడు మందిలో ఒక్కరంటే.. ఒక్కరు కూడా తెలుగు రాష్ట్రాలకు చెందిన నేత లేరు. ఏపీ, తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జులు ఊమెన్ చాందీ, కుంతియాలకు మాత్రం చోటు కల్పించారు. మిగతా అంతా దాదాపు పాతవారే ఉన్నారు.

యూపీఏ-1, యూపీఏ-2 ప్రభుత్వాలు ఏర్పడ్డాయి అంటే దానికి కారణం…ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ సాధించిన అద్భుత విజయాలే కారణం. ఆ పరిస్థితి నుంచి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు.. కనీసం సిడబ్ల్యూసీ స్థాయికి తగిన నెతలెవరు లేనంతగా దిగజారిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా పార్టీనే నమ్ముకున్న కొంత మంది సీనియర్లు ఉన్నారు. తెలంగాణనూ.. జైపాల్ రెడ్డి లాంటి దిగ్గజాలు ఉన్నారు. వీరెవర్నీ.. కాంగ్రెస్ పార్టీ అధినేత పరిగణనలోకి తీసుకోలేదు. ఆంధ్రప్రదేశ్‌లో పళ్లంరాజు, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, ఇటీవలే పార్టీలో తిరిగి చేరిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి లాంటి వాళ్లు ఉన్నా.. వారిని పరగిణనలోకి తీసుకోలేదు.

ఆంధ్రప్రదేశ్‌పై ఆ పార్టీకి ఆశల్లేవనుకున్నా.. తెలంగాణపై మాత్రం.. కాంగ్రెస్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో అధికారం సాధించాలనే పట్టుదలను ప్రదర్శిస్తోంది. పైగా తెలంగాణలో.. పార్టీనే అంటి పెట్టుకుని.. హైకమాండ్ వద్ద పలుకుబడి సాధించిన నేతలు కూడా ఉన్నారు. జైపాల్ రెడ్డి , పొన్నాల, మధుయాష్కీ, వీహెచ్, రేణుకా చౌదరి లాంటి పెద్ద లీడర్లు కూడా లెక్కలోకి రాకుండా పోయారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఇలా ఏ కోటాను… తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్క నేత కూడా.. రాహుల్ గాంధీ కంటికి ఆనలేదు. జాతీయ స్థాయిలో దిగ్విజయ్ సింగ్, కమల్‌నాథ్ లాంటి నేతల్ని పక్కన పెట్టినా.. వారికి ఉన్న బాధ్యతల రీత్యా అలా సర్ధుబాటు చేశారనుకుందాం. కానీ ప్రత్యేకంగా తెలుగురాష్ట్రాల కాంగ్రెస్ నేతలపై.. రాహుల్ గాంధీ ఇలా శీతకన్నేయడం ఎవరికీ అర్థం కావడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close