జనసేన గురించిన ప్రశ్నకి తొలిసారి స్పందించిన జూనియర్ ఎన్టీఆర్

“2019 ఎనికల్లో ప్రజలముందుకు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ రాబోతోంది. మరి ఈ పార్టీ మీద మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి?” ఇదీ జై లవ కుశ ప్రమోషన్స్ లో భాగంగా టివి ఛానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తున్న జూనియర్ ఎన్ టీఆర్ కి ప్రముఖ ఛానెల్లో ఇవాళ ఎదురైన ప్రశ్న.

ఈ మధ్య టివి ఛానెళ్ళల్లోనూ, సోషల్ మీడియా వెబ్ ఛానెళ్ళలోనూ, సినీ రాజకీయ వర్గాలకి చెందిన ఎవరినీ ఇంటర్వ్యూలు చేస్తున్నా, సీరియస్ గానో లేక యధాలాపంగానో ఎదురవుతున్న ప్రశ్న ఇది. దీనికి సమాధానంగా – కొంతమంది జనసేన కి సపోర్ట్ గా సమాధానమిస్తే, కొందరు డిప్లమటిక్ సమాధానాలతో తప్పించుకుంటూ ఉంటే ఎవరో ఒకరిద్దరు నెగటివ్ వ్యాఖ్యానాలు చేసి, కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరి యాంకర్, జూనియర్ ఎన్ టీఆర్ ని ఈ ప్రశ్న ని అడగ్గానే ఒక్కసారిగా ఆడియెన్స్ లో క్యూరియాసిటీ క్రియేట్ అయింది – ఏం సమాధానం చెబుతాడోనని.

అయితే జూనియర్ ఎన్ టీఆర్ మాత్రం చాల మెచ్యూర్డ్ గా స్పందించాడు. ఆయన సమాధానమిస్తూ, – ” నాకు బేసిగ్గా ఏ పొలిటికల్ పార్టీ మీదా ప్రత్యేకమైన ఎక్స్పెక్టేషన్స్ లాంటివేమీ లేవు. ఒక భారతదేశ పౌరుడిగా ఏ పార్టీ అయినా సరే, ప్రజలకి మంచి జరిగితే చాలు అనుకుంటాను” అంటూ సమాధానమిచ్చాడు. మొత్తానికి పబ్లిక్ ప్లాట్ ఫాం మీద జూనియర్ ఎన్ టీఆర్ మొదటి సారిగా జనసేన గురించిన ప్రశ్నకి స్పందించిన విధానమిది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.