మిత్రుడు జగన్‌పై ఓవైసీ తీవ్ర అసంతృప్తి..!

పౌరసత్వ సవరణ చట్టానికి.. మరో మాట లేకుండా.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్‌లో.. మద్దతు పలికారు. వైసీపీ ఎంపీలంతా.. బీజేపీ చట్టానికి మద్దతుగా ఓటేశారు. ఇది ఆయనపై.. ముస్లిం వర్గాల్లో కొత్త అనుమానాలకు కారణం అయింది. రాజధాని ఆందోళనల్లో.. ఏపీ ముస్లింవర్గాల ఆక్రోశం పెద్దగా ఎవరికీ వినిపించడం లేదు కానీ… వారి జనాభా అధికంగా ఉన్న ప్రతీ చోటా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రధానంగా వారు..ఏపీ సర్కార్‌నే.. వ్యతిరేకించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు… మరో వైపు నుంచి ఈ డిమాండ్ వినిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి తనకు అత్యంత ఆత్మీయ మిత్రుడని ప్రకటించుకున్న.. అసదుద్దీన్ ఓవైసీ.. పౌరసత్వ చట్టానికి జగన్ ఇచ్చిన మద్దతును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

పౌరసత్వ చట్టంపై.. తాడో పేడో అన్నట్లుగా పోరాడాలని… ముస్లింలకు.. ఓవైసీ పిలుపునిస్తున్నారు. ఈ క్రమంలో.. దేశంలోని బీజేపీయేతర ముఖ్యమంత్రులందరూ.. ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. ప్రకటనలు చేయడాన్ని స్వాగతిస్తున్నారు. అయితే.. ఆయనకు అత్యంత ఆత్మీయులుగా ప్రకటించుకోబడిన.. ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ మాత్రం నోరు తెరవడం లేదు. కనీసం కేసీఆర్ స్వయంగా వ్యతిరేకించకపోయినా.. ఆయన పార్టీ పరంగా వ్యతిరేకతను పార్లమెంట్‌లో తెలిపారు. దాంతో.. కేసీఆర్ విషయంలో ఓవైసీకి అభ్యంతరాలు లేవు. కానీ జగన్ మాత్రం పార్లమెంట్‌లో మద్దతు తెలుపడమే కాదు.. నోరెత్తి.. కేంద్రాన్ని ఆ చట్టంపై.. ఒక్క ప్రశ్న కూడా ప్రశ్నించడం లేదు.

ఇప్పటికి దేశంలో పది మంది ముఖ్యమంత్రులు.. తాము ఆ చట్టాన్ని అమలు చేయబోమని ప్రకటించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా అలాంటి ప్రకటనే చేయాలని ఓ వైసీపీ కోరుకుంటున్నారు. పౌరసత్వ చట్టాన్ని తాము అమలు చేయబోమని ప్రకటిస్తే… కేంద్రం వెనక్కి తగ్గతందని వైసీపీ భావిస్తున్నారు. మెజార్టీ సీఎంలు వ్యతిరేకిస్తే.. కేంద్రం కూడా వెనక్కి తగ్గక తప్పదు. ఎందుకంటే.. కేంద్రం చట్టాలు చేసినా… ఆయా పౌరులు నివసించాల్సింది రాష్ట్రాల్లోనే. అందుకే ఓ ఓవైసీ.. జగన్ పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. కానీ.. జగన్ కష్టాలు జగన్‌వి.. ఓవైసీకి మాత్రం తెలియవా..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close