చైన్ తెగిన సైకిల్ ను స్టాండ్ వేసి తొక్కుతున్నారు టిడిపి వాళ్లు: పవన్

ఎన్నికల ప్రచారంలో భాగంగా తణుకు బహిరంగ సభలో మాట్లాడిన పవన్ కళ్యాణ్- ఇటు జగన్ మీద, అటు చంద్రబాబు మీద తీవ్ర ఆరోపణల తో విరుచుకుపడ్డారు. కెసిఆర్ బిస్కెట్ల కోసం జగన్ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు అని వ్యాఖ్యానించిన పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ సైకిల్ చైన్ ఎప్పుడో తెగిపోయిందని, చైన్ తెగిపోయినా కూడా స్టాండ్ వేసి సైకిల్ తొక్కుకుంటూ తెలుగుదేశం పార్టీ వాళ్లు కాలం వెళ్లదీస్తున్నారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

2018 మార్చి 14న జనసేన ఆవిర్భావ సభలో సైకిల్ చైన్ తాము తెంపి వేశామని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డగోలుగా అవినీతి చేయడం వల్లే వాళ్ల సైకిల్ చైన్ తెంపి వేయాల్సి వచ్చిందని పవన్ కళ్యాణ్ అన్నారు‌. అయితే సైకిల్ చైన్ తెగిపోయినా కూడా, తెలుగుదేశం పార్టీ వాళ్లు ఇప్పటికీ తమ పరిస్థితి బాగానే ఉందని అనుకుంటూ భ్రమలో ఉన్నారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ కానీ , వైఎస్ఆర్ సీపీ కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవని పవన్ కళ్యాణ్ జన సైనికులకు కేరింతల మధ్య వ్యాఖ్యానించారు. ఇటు తెలుగుదేశం పార్టీ అటు వైఎస్సార్ సీపీ ఇద్దరూ కూడా మూడో పార్టీ వచ్చినప్పుడు దాన్ని తొక్కి వేయడానికి విపరీతంగా ప్రయత్నిస్తున్నారని అన్న పవన్ కళ్యాణ్, అప్పట్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా ఇలాగే దుష్ప్రచారం చేశారని, ఇప్పుడు జనసేన తొక్కి వేయడానికి అన్ని రకాలుగా ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

రష్యాలో జార్ చక్రవర్తులు కూడా , విప్లవం కారణంగా తమ రాజ్యాలు పతనమయ్యే స్థితికి వచ్చినప్పటికీ దాన్ని గుర్తించకుండా కోట లో కూర్చుని అంతా బాగుందని అనుకునేవారని, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ , వైఎస్ఆర్ సీపీ కూడా వారి వారి కోటల లో కూర్చుని అలాగే భావిస్తున్నాయని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా జనసేన పార్టీ లేకుండా తెలుగుదేశం కానీ వైఎస్సార్సీపీ కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదని పవన్ కళ్యాణ్ మరోసారి ఉద్ఘాటించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కోడ్ ఉండ‌గా ఏపీలో టీచ‌ర్ల బ‌దిలీలు… తెర వెనుక ఉంది ఆయ‌నేనా?

ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉండ‌గా ఎలాంటి నిర్ణ‌యాలు ఉండ‌వు. రూల్స్ ప్ర‌కారం... ఎన్నిక‌ల సంఘం ఆదేశాల మేర‌కు రోజు వారీ కార్య‌కాలాపాలు మాత్ర‌మే జ‌రుగుతుంటాయి. కొత్త ప్ర‌భుత్వాలు ఏర్పాడ్డాక లేదంటే కోడ్...

రూల్స్ పాటించేవాళ్లు కౌంటింగ్ ఏజెంట్లుగా వెళ్లొద్దు : సజ్జల

సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటింగ్ ఏజెంట్లకు రూల్స్ పాటించవద్దని చెప్పి పంపించారు. శిక్షణా కార్యక్రమం పెట్టి రూల్స్ చెప్పాల్సిన పెద్ద మనిషి రూల్స్ పాటించే వాళ్లు కౌంటింగ్ కు వెళ్లొద్దని రూల్స్ విరుద్ధంగా వైసీపీకే...

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు… పత్తాలేని బీజేపీ..!!

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను కనీవినీ ఎరగని రీతిలో నిర్వహించేలా ప్లాన్ చేస్తోంది అధికార కాంగ్రెస్. పైకి తెలంగాణ ఖ్యాతిని చాటేందుకు అని చెబుతున్నా కాంగ్రెస్ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని చాటడమే ఆ...

టెర్రరిస్టులకు సీఎం రేవంత్ నెంబర్ ఇచ్చిన రాజాసింగ్

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే టెర్రరిస్టులకు సీఎం రేవంత్ రెడ్డి నెంబర్ ఇచ్చారు. ఈ విషయాన్ని ఆయనే చెప్పుకున్నారు. ఆయనకు పాకిస్తాన్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఐదారు నెంబర్ల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close