టీడీపీ, జనసేన పొత్తులు ఫైనల్ – ఇక యుద్ధమేనన్న పవన్ !

వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ప్రకటించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న చంద్రబాబుతో ములాఖత్ తర్వాత పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు. జగన్ రెడ్డి యుద్ధానికి సిద్ధమంటే.. తాము కూడా సిద్ధమేనని ప్రకటించారు. గత నాలుగున్నరేళ్లుగా అరాచక పాలన చూస్తున్నామని.. అరాచక పాలనలో భాగంగానే చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకే వచ్చానని సగటు మనిషి వేదన జనసేన ఆవిర్భావ సభలోనే మాట్లాడానన్నారు. ఇవాళ ములాఖత్ ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైనది . వచ్చే ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం కలిసే వెళ్తాయని.. ఇది మా ఇద్దరి భవిష్యత్తు కోసం కాదు.. రాష్ట్ర భవిష్యత్తు కోసమేనని ప్రకటించారు.

వైసీపీని సమిష్టిగా ఎదుర్కొనే సమయం ఆసన్నమైందన్నారు. చంద్రబాబు రాజకీయనేత… జగన్ ఆర్థిక నేరస్థుడన్నారు. సైబరాబాద్ నిర్మించిన, హైటెక్ సిటీ సృష్టించిన వ్యక్తిని జైల్లో పెట్టడం బాధాకరమన్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలనే తన ఆకాంక్ష అనతి.. వైసీపీ నేతలు మాపై రాళ్లు వేసే ముందు ఆలోచించుకోవాలని సలహా ఇచ్చారు. రాళ్లు వేసిన ఎవరినీ వదిలిపెట్టబోమన్నారు. వైసీపీ పాలనతో మునిగిపోయామని.. అధికారులు జగన్ ను నమ్ముకుంటే.. కుక్కతోకను పట్టుకుని గోదారి ఈదినట్లేనని హెచ్చరించారు. తాను తీసుకున్న నిర్ణయాలు కొందరికి ఇబ్బందిగా ఉంటాయని.. దక్షిణాది నుంచి మోదీకి మద్దతు తెలిపిన వ్యక్తిని తానేనన్నారు. దేశానికి బలమైన నాయకుడు కావాలని అనుకున్నానని మోదీకి మద్దతు తెలిపిన సమయంలో నన్ను అందరూ తిట్టారన్నారు. కానీ ఒక నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గననని స్పష్టం చేశారు. ఏ రోజు వెళ్లినా కూడా మోదీ పిలిస్తేనే వెళ్లానని ఆ స్థాయి నాయకుల సమయం వృథా చేయననన్నారు. 2014లో బీజేపీ, టీడీపీ కు మద్దతిచ్చేందుకు కూడా ముఖ్యకారణం ఉందన్నారు.

విడిపోయిన ఏపీకి అనుభవం ఉన్న నాయకుడు కావాలని అనుకున్నానన్నారు. చంద్రబాబు పాలన, విధానపరమైన అభిప్రాయ బేధాలు ఉండొచ్చు కానీ చంద్రబాబు అనుభవం, అసమర్థతపై సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. లక్షల కోట్ల సంపదను సృష్టించిన సైబరాబాద్ నిర్మించిన వ్యక్తిపై రూ.317 కోట్లు స్కామ్ అని చెబుతున్నారని మండిపడ్డారు. ఎవరో చేసిన తప్పును బ్యాంకు ఛైర్మన్ కు అంటగడతామా? అని ప్రశ్నించారు. డీజీపీ, సీఎస్ తో సహా ఎవరిపైనైనా పాత కేసులు తిరగదోడే అవకాశం ఉంటుందన్నారు. చట్టాలను అధిగమించి చేసే అధికారులు ఆలోచించుకోవాలని.. పోలీసు వ్యవస్థ ఇంత బానిసత్వంగా ఉంటే ఎవరేం చేయలేరన్నారు. మీకు సమయం ఆరు నెలలు మాత్రమే ఉంది .. యుద్ధమే కావాలంటే యుద్దానికి సిద్ధమేనన్నారు. తప్పులను సరిదిద్దుకోవడానికి మీకు 6 నెలలు సమయముందన్నారు. అక్రమంగా ఇసుక, మైనింగ్, బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న ఎవరినీ వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన కలిసి పోటీ చేయబోతున్నాయి – బీజేపీ కూడా మాతో కలిసి వస్తుందని ఆశిస్తున్నామన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రూల్స్ రంజన్.. సూపర్ కాన్ఫిడెన్స్

ఈవారం వస్తున్న ప్రామెసింగ్ సినిమాల్లో కిరణ్ అబ్బవరం 'రూల్స్ రంజన్' ముందువరుసలో వుంది. కిరణ్ అబ్బవరం పక్కింటి కుర్రాడు ఇమేజ్ తో చేసిన సినిమాలు మంచి ఫలితాన్ని ఇచ్చాయి. రూల్స్ రంజన్ ఆ...

సిద్దార్థ్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ !

సిద్ధార్థ్ కి సినిమాలు కలసిరావడం లేదు. ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ ఏదీ నిలబడటం లేదు,. హిట్టు అనే మాట రావడం లేదు. ఇటివలే టక్కర్ అనే సినిమా చేశాడు. సిద్ధార్థ్ పై...

లోకేష్‌పై అసలు ఎఫ్ఐఆర్లే లేవని చెబుతున్న సీఐడీ

లోకేష్ ను అరెస్టు చేయడం ఖాయమని ఊగిపోయిన సీఐడీ ఇప్పుడు ఆయన పేరు ఇంకా ఎఫ్ఐఆర్‌లో పెట్టలేదని చెబుతోంది. ఐఆర్ఆర్ కేసులో ఏ 14గా చేర్చి.. అరెస్ట్ చేస్తామన్నట్లుగా ఢిల్లీ వెళ్లి .....

హిందీలో మార్కులు కొట్టేసిన రవితేజ

రవితేజ చక్కని హిందీ మాట్లడతారు. ఆయన నార్త్ లో కొన్నాళ్ళు వుండటం వలన హిందీ అలవాటైయింది. ఇప్పుడీ భాష 'టైగర్ నాగేశ్వరరావు' కోసం పనికొచ్చింది. రవితేజ కెరీర్ లో చేస్తున్న మొదటి పాన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close