పెత్తందారు సిద్ధమైతే ప్రజలకు నరకమే !

సిద్ధం పేరుతో సభలు పెడుతున్న జగన్ రెడ్డి ప్రజలకు తాను ఎంతటి ప్రమాదకారో… తనకు మళ్లీ ఓటు వేస్తే ఎంత ఘోరమైన పరిస్థితులు ఉంటాయో అంచనా వేసుకోమని శాంపిల్ చూపిస్తున్నారు. దెందులూరు వద్ద నిర్వహిస్తున్న సిద్ధం సభ కోసం ఆయన టీం చేసిన అరాచకాలు చూస్తే.. .. ఇలా కూడా చేస్తారా అని ఎవరైనా ఆశ్చర్యపోతారు.

ఓ రాజకీయ పార్టీ సభ కోసం పబ్లిక్ పరీక్షలను వాయిదా వేయడం చరిత్రలో జరిగిందా ?. ఇప్పుడు జరిగింది. ఇంటర్ పబ్లిక్ పరీక్షలను వాయిదా వేసేశారు. అదీ కూడా కొన్ని జిల్లాల్లో విద్యార్థులకు మాత్రమే. విద్యారంగ నిపుణులు సైతం ఆశ్చర్యపోయారు. జన సమీకరణ కోసం స్కూల్ బస్సులన్నింటినీ వాడుకోవడానికి ఈ నిర్ణయం. పరీక్షలనే కాదు.. స్కూళ్లకు సెలవులు ఇచ్చేశారు. కొన్ని జిల్లా పరిధిలో సభ నిర్వహిస్తున్నందున ఆయా జిల్లాల స్కూళ్లన్నింటికీ సెలవులు ఇచ్చేశారు.

ఇక చెట్లు కొట్టేశారు.. పంట కాలువలు పూడ్చేశారు… జాతీయ రహదారిపై డివైడర్లను కూడా తొలగించారు. ఇంత అరాచకం చేసి సభ నిర్వహించాల్సిన అవసరం ఏమిటో అని ప్రజలు కూడా మండిపడుతున్నారు. ఇంకా విషయం ఏమిటంటే ఈ సభలకు ప్రజలు పన్నులుగా కట్టిన సొమ్మునే ఖర్చు పెడుతున్నారు. వేల కొద్దీ ఆర్టీసీ బస్సుల్ని వాడుకుంటున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా చెల్లించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.

పెద్దందారు తాము సిద్ధమంటూ ఇచ్చే బిల్డప్‌కు ప్రజలకు నరకం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వేలంపాట మాదిరి వైసీపీ మేనిఫెస్టో..!?

వైసీపీ మేనిఫెస్టో చూసిన వారందరికీ వేలంపాట గుర్తుకు రాక మానదు. టీడీపీ ఒకటి అంటే...మేము రెండు అంటాం అనే తరహలో వైసీపీ మేనిఫెస్టోను రూపొందించినట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ఏమాత్రం అంచనా...

వైజాగ్ నుంచి పాలన… జగన్ ను జనం విశ్వసించేనా..?

మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్ రెడ్దికి ఎన్నికల్లో క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల...

సేమ్ మేనిఫెస్టో : ఆశలు వదిలేసుకున్న జగన్ !

వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏ మాత్రం అమలు చేయలేపోయిన గత ఎన్నికల మేనిపెస్టోను మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని...

ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజ్ మాయం..!!

ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎట్టకేలకు బ్యాండేజ్ వదిలేశారు. జగన్ కనుబొమ్మపై రాయి దాడి జరిగి రెండు వారాలైనా బ్యాండేజ్ విప్పకపోవడంతో ఇదంతా సానుభూతి డ్రామా అనే చర్చ జరిగింది. జగన్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close