పెత్తందారు సిద్ధమైతే ప్రజలకు నరకమే !

సిద్ధం పేరుతో సభలు పెడుతున్న జగన్ రెడ్డి ప్రజలకు తాను ఎంతటి ప్రమాదకారో… తనకు మళ్లీ ఓటు వేస్తే ఎంత ఘోరమైన పరిస్థితులు ఉంటాయో అంచనా వేసుకోమని శాంపిల్ చూపిస్తున్నారు. దెందులూరు వద్ద నిర్వహిస్తున్న సిద్ధం సభ కోసం ఆయన టీం చేసిన అరాచకాలు చూస్తే.. .. ఇలా కూడా చేస్తారా అని ఎవరైనా ఆశ్చర్యపోతారు.

ఓ రాజకీయ పార్టీ సభ కోసం పబ్లిక్ పరీక్షలను వాయిదా వేయడం చరిత్రలో జరిగిందా ?. ఇప్పుడు జరిగింది. ఇంటర్ పబ్లిక్ పరీక్షలను వాయిదా వేసేశారు. అదీ కూడా కొన్ని జిల్లాల్లో విద్యార్థులకు మాత్రమే. విద్యారంగ నిపుణులు సైతం ఆశ్చర్యపోయారు. జన సమీకరణ కోసం స్కూల్ బస్సులన్నింటినీ వాడుకోవడానికి ఈ నిర్ణయం. పరీక్షలనే కాదు.. స్కూళ్లకు సెలవులు ఇచ్చేశారు. కొన్ని జిల్లా పరిధిలో సభ నిర్వహిస్తున్నందున ఆయా జిల్లాల స్కూళ్లన్నింటికీ సెలవులు ఇచ్చేశారు.

ఇక చెట్లు కొట్టేశారు.. పంట కాలువలు పూడ్చేశారు… జాతీయ రహదారిపై డివైడర్లను కూడా తొలగించారు. ఇంత అరాచకం చేసి సభ నిర్వహించాల్సిన అవసరం ఏమిటో అని ప్రజలు కూడా మండిపడుతున్నారు. ఇంకా విషయం ఏమిటంటే ఈ సభలకు ప్రజలు పన్నులుగా కట్టిన సొమ్మునే ఖర్చు పెడుతున్నారు. వేల కొద్దీ ఆర్టీసీ బస్సుల్ని వాడుకుంటున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా చెల్లించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.

పెద్దందారు తాము సిద్ధమంటూ ఇచ్చే బిల్డప్‌కు ప్రజలకు నరకం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా?

ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని సర్కార్ ప్రకటించినా... వాలంటీర్లలో అనుమానాలు ఇంకా అలాగే ఉన్నాయి. జులై మొదటి తేదీన సచివాలయం సిబ్బందితో ఫించన్ లు పంపిణీ చేసిన కూటమి ప్రభుత్వం.. వాలంటీర్ల అవసరం...

జ‌గ‌న్ కు ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు… జ‌వాబు చెప్పే ద‌మ్ముందా?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై ఆయ‌న చెల్లి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో వైసీపీ చేసిన ధ‌ర్నా, అక్క‌డ జ‌గ‌న్ చేసిన...

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

HOT NEWS

css.php
[X] Close
[X] Close