లక్కుతోక తొక్కిన రాజ్ తరుణ్

ఎవరైనా నక్క తోక తొక్కారని అంటారు కాని విచిత్రంగా లక్కు తోక తొక్కడం ఏంటని అందరు ఆశ్చర్యపడవచ్చు. ప్రస్తుతం రాజ్ తరుణ్ గురించి తెలిసిన వారు ఎవరైనా ఇలానే అంటారు. హీరోగా సూపర్ సక్సెస్ మీదున్న రాజ్ తరుణ్ అసలు తాను హీరో అవడానికి పరిశ్రమకు రాలేదని దర్శకత్వం చేయడం తన కల అని ఈమధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే మనోడు అలా అన్నాడో లేదో వర్మ తనకు దర్శకత్వం చేసే అవకాశం ఇస్తున్నాడని తెలుస్తుంది.

ప్రస్తుతం రాజ్ నటిస్తున్న సినిమాల్లో వర్మ మూకీ సినిమా కూడా ఒకటి.. అయితే ఆ సినిమా షూటింగ్ సమయంలో రాజ్ దగ్గర దర్శకత్వ ప్రతిభను గమనించిన వర్మ తనకు దర్శకత్వం చేసే అవకాశం ఇస్తున్నాడని సమాచారం. వర్మ రాసిన కథను దర్శకత్వం చేయమని రాజ్ ని కోరాడట. అనుకోకుండా వచ్చిన ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలా లేక కాదనుకోవాలా తెలియక సంక్షోభంలో ఉన్నాడు రాజ్ తరుణ్.

నటించిన మూడు సినిమాలు సూపర్ హిట్ చేసుకున్న రాజ్ కొంతకాలం హీరోగానే కొనసాగితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు అతని సన్నిహితులు. మరి అయితే వర్మ ఇచ్చిన అవకాశం కూడా గొప్పది కావడం చేత అటు కూడా మొగ్గు చూపే అవకాశం ఉంది. మరి రాజ్ నిర్ణయం ఎలా ఉండబోతుందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జూన్ 27న ‘క‌ల్కి’

ప్ర‌భాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'క‌ల్కి' రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. ఈ చిత్రాన్ని జూన్ 27న రిలీజ్ చేయాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించుకొంది. దీనిపై అతి త్వ‌ర‌లోనే నిర్మాత‌లు...

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close