దొంగ ఓట్లతో గెలిచానని చెప్పుకుంటున్న రాపాక !

సాంకేతికంగా జనసేనకు ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యే తన మాటలతో తన పరువు తీసుకుంటున్నారు. తనకు టీడీపీ పదికోట్ల ఆఫర్ ఇచ్చిందని.. తర్వాత ఇవ్వలేదని… ఓటు వేసి ఉంటే ఇచ్చే వారని ఇలా రకరకాలుగా చెప్పుకున్న రాపాక.. ఒక్క రోజు తిరిగే సరికి తనది దొంగ ఓట్ల గెలుపని తేల్చేశారు. గత ఎన్నికల్లో ఆయన 814 ఓట్ల తేడాతో గెలిచారు. ఈ మెజార్టీ అంతా తన స్వగ్రామంతో పాటు ఇతర చోట్ల వేయించిన దొంగ ఓట్ల వల్లే వచ్చిందని చెబుతున్నారు. ఇలా ఆయన నేరుగా చెప్పుకుంటున్న వీడియో వైరల్ అవుతోంది. గత ఎన్నికల్లో ఆయన జనసేన తరపున పోటీ చేశారు. జనసేనకే దొంగ ఓట్లు వేయించారన్నమాట.

రాపాక వరప్రసాద్ మొదటి నుంచి ఇలాగే కామెడీ అవుతున్నారు. జనసేన నుంచి గెలిచి వైసీపీలో చేరి జగన్ భజన చేయడమే కాకుండా పవన్ ను కించ పరిచేలా మాట్లాడేవారు. వైసీపీలో కష్టపడితే… డబ్బుల్లేవని జగన్ టిక్కెట్ ఇవ్వలేదు. కానీ పవన్ ఇచ్చారు. అయినా కృతజ్ఞత చూపకుండా వైసీపీకి మారి పవన్ పైనే కామెంట్లు చేయడం కాకుండా ఇప్పుడు తానేదో నీతి మంతుడ్ననని.. టీడీపీ తనకు ఆఫర్ ఇచ్చిందని చెప్పుకురావడం ప్రారంభించారు. అది ఇంకా తేలక ముందే తాను దొంగ ఓట్లతో గెలిచాన ని గొప్పలు పోతున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఇలాగే గెలవడానికి ఆయనేమైనా ప్రణాళికలు వేశారో లేదో తెలియదు కానీ… గత ఎన్నికల్లో ఏం చేశారో మాత్రం చెప్పుకొచ్చారు.

రాపాక అధికార పార్టీకి ఫిరాయించిన రాజోలుకు చేసిందేమీ లేదు. కానీ ఆయన పేకాటలో మాత్రం అన్ని పార్టీల నేతలతో కలిసి చాంపియన్ షిప్‌లు ఆడుతూంటారు. ఆ మధ్య ఇలా కొన్ని ఆడియోలు వైరల్ అయ్యాయి. టీడీపీనేత గొల్లపల్లి సూర్యారావు తో ఆయన పేకాట చాలెంజ్‌లు కలకలం రేపాయి. వచ్చే ఎన్నికల్లో జగన్ టిక్కెట్ ఇస్తారో లేదో కానీ గత రెండు ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన బొంతు రాజేశ్వరరావు మాత్రం జనసేనలో చేరిపోయారు

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మూగబోయిన భాగ్యనగర్ రైలు కూత…ఆ లీడర్లపై ప్యాసింజర్ల ఆగ్రహం

దాదాపు నలభై ఏళ్లపాటు పరుగులు పెట్టిన భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ రైలు కూత మూగబోయింది. మూడో రైల్వే మరమ్మత్తుల పేరిట దక్షిణ మధ్య రైల్వే అధికారులు భాగ్యనగర్ రైలును రద్దు చేశారు. ఇతర...

నెల్లిమర్ల రివ్యూ : అడ్వాంటేజ్ జనసేన లోకం మాధవి !

తెలుగుదేశం పార్టీతో పొత్తులో భాగంగా జనసేన పట్టుబట్టి తీసుకున్న నియోజకవర్గం నెల్లిమర్ల. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఈ నియోజకవర్గం పరిధిలోనే బోగాపురం ఎయిర్ పోర్టు నిర్మించాల్సి ఉంది. కానీ జగన్ దాన్ని...

లోకేష్ యువగళం – మరో సారి బ్లాక్ బస్టర్ !

నారా లోకేష్ మంగళగిరిలో సైలెంట్ గా ప్రచారం చేసుకుంటే .. నారా లోకేష్ ఎక్కడ అని వైసీపీ నేతలు ఆరా తీస్తూ ఉంటారు. నారా లోకేష్ బయటకు వస్తే ప్రచారం ప్రారంభిస్తే...

ట్యాపింగ్ కేసులో కీలక పత్రాలు బయటపెట్టిన బండి సంజయ్ – ఎలా ?

ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరును రాధాకిషన్ రావు అనేక సార్లు చెప్పినప్పటికీ ఆయన కోసమే తాము ట్యాపింగ్ చేశామని నిర్దారించినప్పటికీ కేసీఆర్ కు ఇంత వరకూ నోటీసులు ఇవ్వకపోవడానికి కారణం ఏమిటని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close