కేసీఆర్ కంటి పరీక్షలను అమిత్ షా సమక్షంలో చేయించుకున్నారా..?

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్.. మూడో కంటికి తెలియకుండా.. ఢిల్లీ వెళ్లారు. అలాగే తిరిగి వచ్చారు. ఈ క్రమంలో ఆయన ఏం చేశారనేదానిపై… అనేక అనేక ఉహాగానాలు వస్తున్నాయి. అధికారిక సమాచారం ప్రకారం.. కేసీఆర్.. తీరిక లేకుండా బహిరంగసభల్లో పాల్గొనబోతున్నారు కాబట్టి… పన్ను, కన్ను.. రెండూ సరిగ్గా ఉన్నాయో లేదో.. చెక్ చేసుకోవడానికి ఢిల్లీ వెళ్లారు. దాని కోసం.. ఢిల్లీ వరకూ ఎందుకు… తెలంగాణలో కంటి వెలుగు ప్రోగ్రాం జరుగుతోంది కదా.. అన్న విమర్శలు చాలా వస్తున్నాయి. ఆ విమర్శలతో పాటు… అసలు ఢిల్లీ టూర్ వెనుక ఉన్న అజెండా ఏమిటన్నది కూడా.. బయటకు వస్తోంది.

కేసీఆర్ బీజేపీ పెద్దలతో ఢిల్లీలో మంతనాలు జరిపారన్నది ప్రధానమైన ఆరోపణ. నిజానికి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఆదివారం హైదరాబాద్‌కు వచ్చారు. బీజేపీకి చెందిన యువమోర్చా కార్యక్రమంలో ప్రసంగించారు. ఆయన వచ్చిన ప్రత్యేక విమానం బేగంపేట విమానాశ్రయంలో ఉంది. ఆయన తిరిగి వచ్చే టప్పటికీ.. ఢిల్లీకి వెళ్లే పని మీద.. కేసీఆర్ కూడా… బేగంపేటకు వచ్చారు. అక్కడ ఇరువురి మధ్య గంటన్నర సేపు చర్చలు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో ఎన్నికలపైనే వీరి మధ్య ప్రధానంగా చర్చ జరిగిందని చెబుతున్నారు. సిట్టింగ్ సీట్లకు భరోసా ఇచ్చిన కేసీఆర్ ను..మరో నాలుగైదు .. బీజేపీకి బలమున్న స్థానాల్లో…సహకరించాలని అమిత్ షా కోరినట్లు సమాచారం. ఇది కాకుండా.. రాజకీయ వ్యూహారాలపైనా.. వారి మధ్య చర్చ జరిగింది.

ఓ పార్టీ అధ్యక్షుడ్ని కలవడానికి.. ప్రత్యేకంగా బేగంపేట ఎయిర్ పోర్టుకు వెళ్లాడన్నపేరు ఎందుకన్న ఉద్దేశంతో… ఆరోగ్య పరీక్షల కోసం ఢిల్లీకి వెళ్తున్నట్లు బయలుదేరి వెళ్లారు కానీ.. కేసీఆర్.. ఇలా వెళ్లి అలా వచ్చేశారు. నిజానికి కేసీఆర్.. ఢిల్లీ ఎజెండా.. అమిత్ షాతో చర్చలు జరపడమే.. అదికూడా బెంగపేట ఎయిర్ పోర్టులో. కానీ ఎవరికీ అనుమానం రాకుండా… అలా ఢిల్లీ వరకూ వెళ్లొచ్చారనేది.. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటి హాట్ టాపిక్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close