ఒక్క నెల కాలేదు..అప్పుడే ఆర్టీసీ ఉద్యోగుల నిరసనలు..!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో చెప్పినట్లుగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి వారికి ప్రభుత్వ ఉద్యోగులుగా జీతాలు కూడా అందుతున్నాయి. అది వారి సుదీర్ఘ డిమాండ్. ప్రభుత్వం సాకారం చేసింది. కానీ.. అప్పుడే వారు నిరసనలకు దిగుతున్నారు. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా డిపోల వద్ద ఉద్యోగులు నిరాహారదీక్షలు చేయనున్నారు. ఏపీలో ఉన్న మొత్తం 128 డిపోల వద్ద ఇవి జరుగుతున్నాయి. ఆర్టీసీలో విలీనం చేసినందుకు ముఖ్యమంత్రి చిత్ర పటానికి పాలభిషేకం చేసి.. నెల రోజులు కూడా కాలేదు. అప్పుడే వీరు ఎందుకు నిరసనలకు దిగుతున్నారన్నది చాలా మందికి అర్థం కాని విషయం.

అయితే ఉద్యోగులు మాత్రం… ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల .. సమయానికి జీతాలు వస్తాయనే నమ్మకం పెరిగింది కానీ.. ఆర్టీసీలో ఉన్నప్పుడు… ఉన్న సౌకర్యాలన్నింటినీ తొలగించారని… మండి పడుతున్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశామని చెప్పి.. ఉన్న సౌకర్యాలను తొలగించారని.. కార్మికులు ్ంటున్నారు. ఆర్టీసీలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీ రూట్లలో స్కూల్ బస్సులు తిప్పుకునేందుకు అనుమతిస్తూ.. ప్రైవేట్‌ ఆపరేటర్లకు అనుకూలంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని..ఉద్యోగులు అనుమానిస్తున్నారు. ఉద్యోగులకు బీమా, పెన్షన్ అందించే ట్రస్టుల్ని… మూసేశారు. వారిని మళ్లీ ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఆర్టీసీ కార్మికులకు ఎన్ని చేసినా… సంతృప్తి ఉండదని.. ఇంకా ఇంకా కావాలంటూ ఉంటారని.. అధికార పార్టీ వైపు నుంచి విమర్శలు వస్తున్నాయి. ఆర్టీసీ కార్మికులందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన తర్వాత … ఉద్యోగులుగానే చూస్తారని..వారికి ఉండే సౌకర్యాలు మాత్రమే ఉంటాయని అంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి… ఆర్టీసీలో ఉన్న సౌకర్యాలు కూడా ఉండాలని కోరుకుంటే… ఎలా అని అంటున్నారు. అన్ని రకాల ప్రయోజనాలు పొందాలంటే సాధ్యం కాదంటున్నారు. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో మరి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

లోకేష్ యువగళం – మరో సారి బ్లాక్ బస్టర్ !

నారా లోకేష్ మంగళగిరిలో సైలెంట్ గా ప్రచారం చేసుకుంటే .. నారా లోకేష్ ఎక్కడ అని వైసీపీ నేతలు ఆరా తీస్తూ ఉంటారు. నారా లోకేష్ బయటకు వస్తే ప్రచారం ప్రారంభిస్తే...

ట్యాపింగ్ కేసులో కీలక పత్రాలు బయటపెట్టిన బండి సంజయ్ – ఎలా ?

ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరును రాధాకిషన్ రావు అనేక సార్లు చెప్పినప్పటికీ ఆయన కోసమే తాము ట్యాపింగ్ చేశామని నిర్దారించినప్పటికీ కేసీఆర్ కు ఇంత వరకూ నోటీసులు ఇవ్వకపోవడానికి కారణం ఏమిటని...

మీడియా వాచ్ : “స్టడీ”గా రవిప్రకాష్ ఈజ్ బ్యాక్ !

సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ చాలా వస్తాయి. కానీ స్టడీలు మాత్రం కొన్నే ఉంటాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో రవిప్రకాష్ స్టడీ హాట్ టాపిక్ అవుతోంది. RTV స్టడీ...

వృద్ధుల ప్రాణాలతో రాజకీయం – ఇంత క్రూరమా ?

ఏపీ ప్రభుత్వానికి వృద్ధులను ఎంత హింసిస్తే అంత మంచి రాజకీయం అనుకుంటున్నారు. వాళ్లు ఎంత బాధపడితే అంతగా చంద్రబాబును తిట్టుకుంటారని ఊహించుకుంటూ వాళ్లను రాచి రంపాన పెడుతున్నారు. ఇంటింటికి పంపిణీ చేసేందుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close