డ్యామేజ్ కంట్రోల్ ప్రయత్నాల్లో “సాక్షి”

నిన్న పవన్ కళ్యాణ్ పై “ కార్లు మార్చేసినట్టు పెళ్ళాలు మారుస్తాడు, ఆయనకు నలుగురు భార్యలు” అంటూ వ్యక్తిగత విమర్శలు చేసి జగన్ సెల్ఫ్ గోల్ వేసుకున్న తర్వాత వైఎస్ఆర్సిపి పార్టీ అభిమానులు కూడా తల పట్టుకుని కూర్చున్నారు. అయితే, అందరికంటే ముందుగా చేరుకున్న “సాక్షి”, వెంటనే డ్యామేజ్ కంట్రోల్ ప్రయత్నాలు ప్రారంభించినట్టు అర్థమవుతొంది.

మామూలుగా జగన్ చేసే వ్యాఖ్యలను ప్రముఖంగా స్క్రోలింగ్ ఇచ్చే సాక్షి ఛానల్, జగన్ పవన్ కళ్యాణ్ మీద చేసిన రాజకీయ విమర్శలను మాత్రమే ప్రముఖంగా చూపిస్తూ, వ్యక్తిగత విమర్శలను దాచేసింది. సాక్షి పత్రికలో కూడా ఇవాళ, “ ఆరు నెలలకు ఒకసారిబయటకు వచ్చి వ్యక్తి కూడా మాట్లాడటమే” అంటూ హెడ్డింగ్ బెట్టి ఒక మూలన చిన్న వార్త లో, ఈ వ్యాఖ్యలను కవర్ చేసింది.

ఇక ఇవన్నీ ఒక ఎత్తయితే, పవన్ కళ్యాణ్ నిన్న చేసిన వ్యాఖ్యలను ప్రముఖంగా స్క్రోలింగ్ ఇస్తూ “ బాలకృష్ణ ఇంట్లో కాల్పులపై పవన్ సంచలన వ్యాఖ్యలు” అంటూ స్క్రోలింగ్ ఇస్తున్నారు. నిన్న పవన్ కళ్యాణ్, జనసేన అభిమానులపై అన్యాయంగా పెడుతున్న కేసుల గురించి ప్రస్తావిస్తూ , “జనసేన అభిమానుల బైక్ కి సైలెన్సర్ లేక శబ్దం ఎక్కువ వస్తుందని పోలీసులు కేసులు పెడుతున్నారు, అటుపక్క ఇంట్లో కాల్పులు జరిపిన వాళ్ళు బయట హాయిగా తిరుగుతున్నారు” అంటూ పరోక్షంగా బాలకృష్ణ ఇంట్లో కాల్పుల సంఘటన ప్రస్తావించారు. ఈ వార్తను ప్రముఖంగా స్క్రోలింగ్ ఇస్తూ, నిన్న జగన్ చేసిన వ్యాఖ్యలను దాచేస్తూ, డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి మొత్తానికి “ సాక్షి” నానా పాట్లు పడుతోంది.

ఏదిఏమైనా, వైఎస్ఆర్సీపీకి, జగన్ కి జరగాల్సిన డ్యామేజ్ ఇప్పటికైతే జరిగిపోయింది. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవడం మాత్రమే వాళ్ల చేతుల్లో ఇప్పుడు ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...
video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close