ఏపీకి మళ్లీ ప్రవీణ్ ప్రకాష్.. కానీ సీఎంవోలోకి నో ఎంట్రీ !

సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ మళ్లీ ఏపీకి వచ్చారు. ఆయనకు ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చారు. ఇప్పటి వరకూ ఆయన ఢిల్లీలోని ఏపీ భవన్‌కు రెసిడెంట్‌ కమిషనర్‌గా ఉన్నారు. ప్రవీణ్ ప్రకాష్ వివాదాస్పదమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన గతంలో సీఎంవోలో పూర్తి స్థాయిలో చక్రం తిప్పారు. ఈ క్రమంలో కొన్ని వివాదాస్పదమైన జీవోలు వెలుగులోకి రావడంతో ఆయనను పలు బాధ్యతల నుంచి తప్పించారు.

కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నప్పటికీ.. ఆయనకు ఉన్న రిమార్కుల కారణంగా.. ఏ శాఖ కూడా ఆయనను తీసుకునేందుకు ఆసక్తి చూపించలేదు. దీంతో ఆయన ఓ సందర్భంలో యూపీ రాజకీయాల్లోకి కూడా వెళ్తారన్న ప్రచారం జరిగింది. చివరికి ఢిల్లీ రెసిడెంట్ కమిషనర్‌గా వెళ్లారు. అయితే అక్కడ బోర్ కొట్టిందేమో కానీ మళ్లీ ఏపీకి రావాలనుకున్నారు. ఆయన విజ్ఞప్తి చేసిందే తడవుగా ఏపీకి తీసుకురాగలిగారు కానీ.. మళ్లీ సీఎంవోలోకి తీసుకునేంత ధైర్యం చేయలేకపోయారు. ఆయనకు ఆర్ అండ్ బీ పోస్టింగ్ ఇచ్చి సరి పెట్టారు.

ప్రవీణ్ ప్రకాష్ మళ్లీ తనకు సీఎంవో పోస్టింగ్ ఇవ్వాలని ఒత్తిడి చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడే కాదని.. తర్వాత చూద్దామని చెప్పి ఆయనకు ప్రస్తుతానికి ఆర్ అండ్ బీ సెక్రటరీగా పోస్టింగ్ ఇచ్చారు. ఆయన సీఎంవోలోకి వస్తే మరోసారి అధికార యంత్రాగం అంతా చెల్లాచెదురు అవుతుందన్న ఆందోళన వైసీపీ పెద్దల్లో ఉంది. అందుకే.. ఆయన ఏపీకిరావాలనే కోరికను తీర్చినా.. సీఎంవోలోకి మాత్రం తీసుకోలేకపోయారు. మరోవైపు సీఎస్ సమీర్ శర్మ అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరడంతో విజయానంద్ కొన్నాళ్ల పాటు సీఎస్‌గా వ్యవహరించనున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close