తెలకపల్లి రవి : అసత్యమేవ అపజయతే!

తన మంత్రి వర్గ సహచరి సృతి ఇరానీ ప్రసంగ ప్రభంజనానికి ముగ్ధులై సత్యమేవజయతే అని ట్వీట్‌ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. అయిత హెచ్‌సియు విద్యార్థి రోహిత్‌ మృతికి సంబంధించి ఆమె చెప్పిన వాటిలో చాలా భాగం అవాస్తవాలని తేలిపోయింది. స్వయానా ఆ రోజున అతని మృత దేహాన్ని చూసిన వైద్యులు, నాటి సిబ్బంది, పోలీసులు అందరూ సాక్ష్యాధారాలతో సహా నిజాలు ఏమిటో లోకమంతటికీ తెలియజేశారు. రాజకీయ కారణాల వల్ల తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ వివాదం పెంచుకోకపోయినా ప్రభుత్వాధికారులు కేంద్రంతో సంప్రదించారనే వివరాలు కూడా వెల్లడించారు. రోహిత్‌ ఎబివిపి విద్యార్థిని కొట్టాడనే విధంగా ఆమె చెప్పింది పూర్తిగా అవాస్తవమే. ఇక కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ,ఫిర్యాదు మానవ వనరుల శాఖ తరపున తన జోక్యం ఉత్తరాలతో సహా కనిపిస్తుంటే ఎలాంటి ఒత్తిడి లేదని చెప్పడం కూడా నిజం కాదని అర్థమైపోయింది. జెఎన్‌యు విషయంలోనూ అనవసర ప్రస్తావనలతో వాతావరణం చెడగొట్టినట్టు రాజ్యసభ సాక్షిగా రుజువైంది.దుర్గామాతపై ఎవరో ఏదో పోస్టరు వేశారని చదివి వినిపించడం పొరబాటని ప్రతిపక్షం చేసిన విమర్శకు ప్రభుత్వం తలవంచవలసి వచ్చింది. ఆమె చదివిన భాగాలూ వ్యాఖ్యలూ తొలగిస్తానని ఉపాద్యక్షుడు కురియన్‌ ప్రకటించారు. బెంగాల్‌లో సంథాల్‌ తెగలు మహిషాసురుణ్ని పూజించడానికి సంబంధించిన సమాచారాన్ని ప్రముఖ బెంగాలీ పత్రికలే ప్రచురించాయి. మహిషాసురుడి పేరు మీద మా నగరం ఏర్పడింది గనక మమ్ముల్ను దేశ ద్రోహులంటారేమో నని కొంతమంది ట్వీట్‌ చేశారు. సత్యమేవజయతే నినాదం ఇచ్చిన అశోకుడు పరమత సహనం బోధిస్తే దాన్నిద్వేషానికి వాడుకోవడం తప్పు కదా?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close