నాగ‌బాబు చేయాల్సిన క‌థ‌… చిరంజీవితో!

చాలా కాలం క్రితం… వెలిగొండ శ్రీ‌నివాస్ అనే ర‌చ‌యిత ఓ క‌థ రాసుకొన్నాడు. అందులో ఓ నాన్న త‌న కొడుక్కి పెళ్లి చేయాల‌నుకొంటే, కొడుకేమో తండ్రికే పెళ్లి చేయాల‌ని చూస్తుంటాడు. దాదాపుగా ‘మా నాన్న‌కి పెళ్లి’ లాంటి క‌థే ఇది. అప్ప‌ట్లో ఆయ‌న అనుకొన్న హీరోలు నాగ‌బాబు, త‌రుణ్‌. తండ్రి నాగ‌బాబు అయితే, కొడుకు త‌రుణ్ అన్న‌మాట‌. క‌థ కూడా ఓకే అయిపోయి, ప‌ట్టాలెక్కే త‌రుణంలో సినిమా ఆగిపోయింది.

ఇన్నాళ్ల‌కు ఇలాంటి క‌థే ఒక‌టి సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. ప్ర‌స‌న్న‌కుమార్ బెజ‌వాడ రాసిన `మా నాన్న‌కు పెళ్లి` టైపు క‌థ‌… చిరంజీవికి బాగా న‌చ్చింది. క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ క‌థ మొద‌ల‌వ్వ‌నుంది. చిరంజీవి హీరో. ఆయ‌న త‌న‌యుడిగా డీజే టిల్లు ఫేమ్ సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ న‌టిస్తున్నాడు. చిరంజీవి ప‌క్క‌న త్రిష‌నీ, సిద్దూ ప‌క్క‌న శ్రీ‌లీల‌ని హీరోయిన్లుగా ఎంచుకొన్నారు. ఆగ‌స్టులో ఈ సినిమా మొద‌లు కానుంది. అప్ప‌ట్లో నాగ‌బాబు కోసం అనుకొన్న పాయింట్ ఇదే కావొచ్చు. కానీ… ట్రీట్మెంట్ మాత్రం చిరు స్థాయికీ, ఆయ‌న ఇమేజ్‌కీ తగ్గ‌ట్టుగా ఉంటుంద‌న‌డంలో ఎలాంటి సందేహం అక్క‌ర్లెద్దు. అయితే.. వెలిగొండ శ్రీ‌నివాస్ రాసుకొన్న క‌థ‌కీ, ఇప్పుడు ప్ర‌స‌న్న కుమార్ బెజ‌వాడ రాసిన క‌థ‌కూ ఏమైనా లింకు ఉందా అనేదే డౌటు. దీనికి ఆ ఇద్ద‌రు ర‌చయిత‌లే స‌మాధానం చెప్ప‌గ‌ల‌రు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close