సెట్స్‌లో అడుగుపెడుతున్న సందీప్‌కిష‌న్‌

క‌రోనా వ‌ల్ల షూటింగుల‌న్నీ బంద‌యిపోయాయి. కేంద్ర‌,రాష్ట్ర ప్ర‌భుత్వాలు షూటింగుల‌కు అనుమ‌తులు ఇచ్చినా – హీరోలు ధైర్యం చేయ‌ట్లేదు. ఇప్పుడిప్పుడే యువ హీరోలు షూటింగుల కోసం ముందుకొస్తున్నారు. తాజాగా సందీప్ కిష‌న్ షూటింగ్‌కి రెడీ అయ్యాడు. సందీప్ క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కుతున్న చిత్రం `ఏ 1 ఎక్స్‌ప్రెస్`. ఏఏఏ ఆర్ట్స్‌, పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మంగ‌ళ‌వారం నుంచి హైద‌రాబాద్ లో షూటింగ్ మొదలు పెట్ట‌నున్నారు. సందీప్ కిష‌న్‌పై కొన్ని ముఖ్య‌మైన సన్నివేశాల్ని తెర‌కెక్కిస్తారు. “బ్యాక్ టూ సెట్స్ ఫ్ర‌మ్ టుమారో` అంటూ సందీప్ కిషన్ ఓ ట్వీట్ చేశాడు. క్రీడా నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. ఈ లాక్ డౌన్ స‌మ‌యంలో దేహ ధారుడ్యంపై దృష్టి పెట్టాడు సందీప్‌. ఈ విరామాన్ని స‌రిగ్గా వాడుకుంటూ కండ‌లు పెంచి, ఈ పాత్ర కోసం పూర్తి స్థాయిలో స‌న్న‌ద్ధ‌మ‌య్యాడు. లావ‌ణ్య త్రిపాఠీ క‌థానాయిక‌గా న‌టిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్‌: దిల్ రాజు బ్యాన‌ర్‌లో ధ‌నుష్‌

ధ‌నుష్ ఈమ‌ధ్య తెలుగు ద‌ర్శ‌కులు, తెలుగు నిర్మాత‌ల‌పై దృష్టి పెట్టాడు. 'సార్' అలా వ‌చ్చిందే. ఈ సినిమా బాక్సాఫీసు ద‌గ్గ‌ర మంచి ఫ‌లితాన్ని అందుకొంది. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో 'కుబేర‌' చేస్తున్నాడు....

ఇస్మార్ట్… ప‌ట్టాలెక్కింది!

రామ్ - పూరి జ‌గ‌న్నాథ్ కాంబోలో వ‌చ్చిన 'ఇస్మార్ట్ శంక‌ర్‌' ఇన్‌స్టెంట్ హిట్ అయిపోయింది. రామ్ కెరీర్‌లోనే భారీ వ‌సూళ్ల‌ని అందుకొన్న సినిమా ఇది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'డ‌బుల్ ఇస్మార్ట్'...

అక్ష‌య్ ప‌ని పూర్త‌య్యింది.. మ‌రి ప్ర‌భాస్ తో ఎప్పుడు?

మంచు విష్ణు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న చిత్రం 'క‌న్న‌ప్ప‌'. ఈ సినిమాలో చాలామంది పేరున్న స్టార్స్ క‌నిపించ‌బోతున్నారు. అందులో ప్ర‌భాస్ ఒక‌డు. ఈ చిత్రంలో ఆయ‌న నందీశ్వ‌రుడిగా అవ‌తారం ఎత్త‌బోతున్నారు. అక్ష‌య్ కుమార్...

“ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్” చుట్టూ ఏపీ రాజకీయం !

ఆంధ్రప్రదేశ్ రాజకీయం క్లైమాక్స్ కు చేరుతుంది. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ గా అందరి నోట్ల నలుగుతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చుట్టూ ఇప్పుడు ఏపీ రాజకీయం నడుస్తోంది. ఆ చట్టంలో ఉన్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close