ఏపీలో పెట్రోల్, డీజిల్ రేట్లు టీడీపీ పెంచిందట !

ఏపీలో ప్రభుత్వం ఎవరిది ? . పెట్రోల్, డీజిల్ రేట్లను ఎవరు పెంచుతారు ?. ఈ చిన్న లాజిక్ చిన్న పిల్లవాడికి తెలుస్తుంది. ప్రభుత్వమే రేట్లను పెంచుతుంది. కానీ ఏపీ సర్కార్ వారు ఫ్యాక్ట్ చెక్ ఏం చెబుతుతందో తెలుసా.. టీడీపీ రేట్లను పెంచిందట. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఏపీలో అత్యదిక పెట్రోల్, డీజిల్ రేట్లు ఉన్నాయని మండిపడ్డారు. ప్రజల్ని దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. దీనికి ఫ్యాక్ట్ చెక్ వివరణ ఇచ్చింది. ఏమని అంటే … టీడీపీ పెంచిందట.

2015, ఫిబ్రవరికి ముందు పెట్రోలు పై 31శాతం వ్యాట్, డీజిలు పై 22.5 శాతం వ్యాట్ ఉండేదని, గత ప్రభుత్వం ఈ రేట్లను పూర్తిగా మార్చి, పెంచిందని ఫ్యాక్ట్ చెక్ ద్వారా తెలిపారు. అప్పుడున్న రేట్లకు అదనంగా పెట్రోలుపై లీటరకు రూ.4లు చొప్పున, డీజిలు పై లీటరుకు రూ.4లు చొప్పున ధరలు పెంచింది గత ప్రభుత్వమే అని వెల్లడించారు. అయితే అప్పుడు పెట్రోల్ రేట్లు.. డీజిల్ రేట్లు ఎంత ఉన్నాయో మాత్రం చెప్పలేదు. అప్పట్లో 70 రూపాయలు ఉండేవి. ఇప్పుడు 110 రూపాయలు అయింది. కేంద్రం రెండు సార్లు..త పదేసి రూపాయలు చొప్పున తగ్గించినా రాష్ట్రం తగ్గించలేదు.

అప్పట్లో సీఎం జగన్ రెడ్డి అసెంబ్లీలో పెట్రోల్, డీజిల్ రేట్ల చాలా ఆవేశపడిపోయారు. దేశంలో అత్యధిక రేట్లు ఉన్నాయని అసెంబ్లీలో ఆరోపించేవారు. నిజానికి అది నిజం కాదు. కానీ జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నిజం చేసి చూపించారు. దేశంలోనే అత్యధిక పెట్రోల్, డీజిల్ రేట్లు ఏపీలోనే ఉన్నాయి. టాక్సులు పెంచడమే కాదు.. ఓ రూపాయి రోడ్ సెస్ వేశారు. కానీ రోడ్లను మాత్రం నిర్మించడం కాదు కదా కనీసం రిపేర్లు కూడా చేయించడం లేదు.

ప్రజల్ని దోపిడీ చేసేది తాము.. కానీ చెప్పే సాకులు మాత్రం టీడీపీపైన. ఇంత మాత్రం దానికి తాము పరిపాలిస్తున్నామని చెప్పడం ఎందుకని.. చేతకాదని రాజీనామా చేయవచ్చు కదా అనే సెటైర్లు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close