ల్యాండ్ ఫర్ టిక్కెట్ – తెలంగాణ బీజేపీలో కలకలం !

మల్కాజిగిరి ఎంపీ టిక్కెట్ ను బీజేపీ హైకమాండ్ ఈటల రాజేందర్ కు ఇచ్చింది. ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చే వరకూ బీజేపీలో ఎవరికీ నమ్మకం లేదు. ఎందుకంటే.. ఈటలకు అందరూ వ్యతిరేకమే. బండి సంజయ్ .. కిషన్ రెడ్డి ఇలా అందరూ.. ఎవరికి వారు తమ సపోర్టర్లను ముందుకు నెట్టి .. హైకమాండ్ వద్ద లాబీయింగ్ చేశారు. మురళీధర్ రావు నాలుగేళ్లుగా మల్కాజిగిరిలో పని చేసుకుంటున్నారు. చివరికి ఈటల రాజేందర్ వైపే హైకమాండ్ మొగ్గింది. దీనికి కారణం కూడా బీజేపీ వర్గాల్లో భిన్నంగా ప్రచారం జరుగుతోంది.

మల్కాజిగిరి టిక్కెట్ ను.. వీరందరితో పాటు .. ఓ విద్యాసంస్థల అధిపతి కూడా కోరుకున్నారు. ఆయన తెలంగాణ బీజేపీకి చెందిన ఓ ముఖ్యుడ్ని సంప్రదించారు. ఆయన భరోసా ఇచ్చి.. ప్రచారం చేసుకోవాలన్నారు. దీంతో ఆయన మల్కాజిగిరి వ్యాప్తంగా పలు రకాల కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. ఇలా ఆ ముఖ్యుడు ఊరకనే భరోసా ఇవ్వలేదు. ఆ తెలంగాణ విద్యా సంస్థల అధినేతకు ఇతర రాష్ట్రంలో ఉన్న భూమిని… ఆ ముఖ్యుడికి రిజిస్ట్రేషన్ చేశాడు. అందుకే టిక్కెట్ పై భరోసా ఇచ్చారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఆ నేత కూడా.. విద్యాసంస్థల అధినేతకే టిక్కెట్ ఇవ్వాలని గట్టిగా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఈ మొత్తం వ్యవహారంపై ముందే సమాచారం ఉండటంతో ప్రాథమికదశలోనే విద్యాసంస్థల అధినేత పేరును హైకమాండ్ కొట్టేసింది.

ఈ వ్యవహారం బయటకు రావడంతో… తెలంగాణ బీజేపీలో కలకలం రేగుతోంది. ఇంతకీ తెలంగాణ బీజేపీలో ఆ ముఖ్య నేత ఎవరూ అన్న చర్చ జరుగుతోంది. చాలా కొద్ది మందికి ఆయన ఎవరో తెలుసని అంటున్నారు. బీజేపీలో కూడా ఇలా టిక్కెట్లకు ఆస్తుల్ని రాయించుకునే సంప్రదాయం వచ్చిందని.. అంతా తెలిసీ హైకమాండ్ ఊరుకోదని.. ఎన్నికలు అయ్యాక కఠిన చర్యలు తీసుకుంటుందని గట్టిగా నమ్ముతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close