స్వస్తిక్ గుర్తు పెట్టిన ఓట్లు మాత్రమే చెల్లుబాటు : హైకోర్టు

స్వస్తిక్ గుర్తు లేకపోయినా.. పెన్నుతో గీకినా ఓటు చెల్లుబాటు అవుతుందంటూ..ఎస్‌ఈసీ ఇచ్చిన సర్క్యులర్‌ను హైకోర్టు సస్పెండ్ చేసింది. స్విస్తిక్ గుర్తు కాకుండా.. ఇతర ఏ గుర్తులు బ్యాలెట్లపై ఉన్నా… ఆలాంటి ఫలితాలను కోర్టు ఉత్తర్వులకు లోబడి విడుదల చేయాలని ఆదేశించింది. అర్థరాత్రి ఎస్‌ఈసీ నుంచి వివాదాస్పదమైన సర్క్యూలర్ రావడంతో.. వెంటనే బీజేపీ నేతలు.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఉదయమే విచారణ జరిపిన హైకోర్టు… ఎస్ఈసీ ఆదేశాలను సస్పెండ్ చేసింది. ప్రస్తుతం కోర్టు తీర్పును బట్టి స్వస్తిక్ గుర్తు ఉంటేనే… ఓటు చెల్లుబాటు అవుతుంది.

కారణం ఏమిటో కానీ.. ఎస్‌ఈసీ వివాదాస్పద ఉత్తర్వులు జారీ చేశారు. పెన్నుతో ఓటు వేయడం అనేది ఎప్పుడూ లేదు. అలాంటి ఓట్లు ఎప్పుడూ చెల్లవు. పోలింగ్ అధికారి ఇచ్చిన స్వస్తిక్ గుర్తు ను… అభ్యర్థి గుర్తుపై .. ముద్రవేసినప్పుడు మాత్రమే ఓటు చెల్లుతుంది. పెన్నుల్లాంటివి ఓటు వేయడానికి ఉపయోగించరాదు. అయితే.. అలా చేయడం తప్పని చెప్పినప్పటికీ.. ఓటు చెల్లుబాటవుతుందనే ఉత్తర్వులు ఎస్‌ఈసీ ఇచ్చింది. ఇది రిగ్గింగ్‌ను ఓట్ల రూపంలోకి మార్చుకోవడానికి ఇచ్చిన ఉత్తర్వులని విపక్షాలు ఆరోపణలు గుప్పించాయి. హుటాహుటిన కోర్టుకెళ్లాయి.

ప్రస్తుతానికి ఓట్ల లెక్కింపులో పెన్నుతో గీసిన ఓట్లు చెల్లవు. స్విస్తిక్ గుర్తు ఉన్న ఓట్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుని లెక్కిస్తారు. అయితే పెన్నుతో గీసిన ఓట్లు ఎన్ని ఉంటాయో విడిగా లెక్కించి ఉంచుతారు. మెజార్టీ కన్నా ఎక్కువ ఉంటే… కోర్టు తీర్పు మేరకు.,. నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. అయితే.. పెన్నులతో ఓట్లేయాలి అని ఓటర్లకు తెలియదు. అలా ఎక్కువ మంది వేసే అవకాశం కూడా ఉండదని నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి కౌంటింగ్ రోజు… పెన్ను మార్క్ ట్విస్ట్ రావడం… ఉత్కంఠకు కారణం అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close